
అక్కినేని వారింట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రెండు నెలల కిందే నటి శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నారు నాగ చైతన్య. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఇన్నాళ్ళ తర్వాత ఈ జోడీ ట్రెండింగ్ అవుతున్నారు. దానికి కారణం వాళ్ల పెళ్లి పనులు మొదలవ్వడమే. చైతూ శోభిత పెళ్లిపై మరిన్ని ముచ్చట్లు చూద్దాం పదండి..

సమంతతో విడాకుల తర్వాత కెరీర్లో బిజీ అయిపోయారు నాగ చైతన్య. వరస సినిమాలు చేస్తూ అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. ఈ మధ్యలోనే శోభిత ధూళిపాళతో చైతూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి.

వాటిని కన్ఫర్మ్ చేస్తూ ఆగస్ట్ 8న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైజాగ్లోని శోభిత ధూళిపాళ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి.

సంప్రదాయ దుస్తుల్లో శోభిత ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఇద్దరి పెళ్లిపై కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. డిసెంబర్లో చాలా తక్కువ మందితో చైతూ శోభిత పెళ్లి జరగబోతుంది. ఈ వేడుక చాలా ప్రైవేట్గా జరగబోతుందని తెలుస్తుంది.

పెళ్లికి టైమ్ దగ్గర పడుతుండటంతో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకున్నారు చైతూ, శోభిత. తండేల్ షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది.. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మరోవైపు శోభిత సైతం తన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ జంటను చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.