ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
అత్యంత భారీ బడ్జెట్తో రామాయణ ఇతిహాసం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్గా సీతగా కృతిసనన్ నటిస్తుండగా రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.
తెలంగాణలో బుకింగ్కు సంబంధించి క్లారిటీ వచ్చినా ఏపీ సంగతి మాత్రం చెప్పలేదు. అయితే అక్కడ కూడా బుధవారం నుంచే బుకింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆదిపురుష్ చిత్రాన్ని దేశ్యాప్తంగా ఏకంగా 6200కి పైగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్క హిందీలోనూ సుమారు 4000 స్క్రీన్స్లో ఆదిపురుష్ సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక విడుదల తర్వాత ఈ సంఖ్య 6500కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.