సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్. కానీ ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.
బై టౌన్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. ఇక చాలా కాలం తరువాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.
అందులో సీత పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నా ఈ బ్యూటీ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది.
1990 ఢిల్లీలో ఓ పంజాబ్ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ కృతి సనాన్.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోనే తన స్కూలింగ్ కంప్లీట్ చేసింది ఈ అందాల భామ.
2021లో ఆమె డిజైనర్ మనీష్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్ నూరానియత్ బ్రాండ్ కోసం మోడల్ గా చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ.. హీరోయిన్ గా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.
సోషల్ మీడియాలో కృతి సనన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఈమె ఫాలోయింగ్ నెట్టింట సపరేట్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి.తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన శారీ ఫొటోస్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.