
ఫలానా సినిమాకు ఎందుకు సంతకం చేశామని ఎప్పుడైనా అనిపించిందనుకోండి.. చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉండాలి. ఆ రీజన్ కేవలం మెటీరియల్ రూపంలో కనిపించకూడదు.

మనసుకు సంతృప్తినిచ్చేలా ఉండాలి అని అంటున్నారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఏ నటికైనా కమర్షియల్ సినిమాలకు పని చేయడం సులువు.

మిగిలిన సబ్జెక్టులతో కంపేర్ చేస్తే, మెంటల్ స్ట్రెస్ కాస్త తక్కువగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. నేమ్, ఫేమ్కీ కొదవ ఉండదు.

కానీ అంతకు మించి ఇంకేదో కావాలంటే మాత్రం కచ్చితంగా రిస్క్ తో కూడిన పాత్రలనే చేయాలని అంటున్నారు జాన్వీ.

మరి ఇప్పుడు వైజయంతీ మూవీస్ కూడా అదే విషయాన్నే కన్సిడర్ చేస్తుందా.. లేకుంటే, సరికొత్తగా ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా.. లెట్స్ వెయిట్ అండ్ సీ..

ఇప్పుడు హై రిస్క్ ఉన్న సినిమా చేస్తున్నానని, ఉలఝ్ మూవీని చూసిన వారందరూ ఈ విషయాన్ని కచ్చితంగా ఒప్పుకుంటారని అంటున్నారు ఈ బ్యూటీ.

ఆగస్టులో ఉలఝ్తో పలకరించే జాన్వీ, సెప్టెంబర్లో సౌత్ ఆడియన్స్ ని దేవరతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యీ కాగానే, రామ్చరణ్తో జోడీ కట్టడానికి బుచ్చిబాబు సానా సెట్స్ కి వెళ్తారు మిస్ జాన్వీ.