జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా.. ఈబ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా తన హైట్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా.
ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చిట్టిగా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఈ బ్యూటీకి హైట్ కారణంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పుకొవాలి.
సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడకుండా.. ఇప్పుడు వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది ఫరియా. ఆమె ఫస్ట్ సిరీస్ ది జెంగబూరు కర్స్.
ఈ సిరీస్ ఈనెల 9 నుంచి అంటే రేపటి నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అప్డేట్స్ సోనీ లివ్ సెంటర్ రిలీజ్ చేస్తుంది.
ఇందులో ప్రియ అనే పాత్రలో కనిపించనుంది ఫరియా. ఆమె పాత్రనే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ఇందులో నాజర్, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రలలో నటిస్తున్నారు.