పసుపు-నిమ్మ కలిపి ముఖానికి అప్లై చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు ఎన్నో వాడుతుంటారు. అయితే సహజంగానే మీ ముఖం చందమామలా మెరిసిపోవాలంటే ఒక్క పసుపు చాలని అంటున్నారు నిపుణులు. చర్మ సమస్యలు నయం కావడానికి చాలా మంది ముఖానికి పసుపు..
Updated on: Dec 09, 2025 | 8:46 PM

ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు ఎన్నో వాడుతుంటారు. అయితే సహజంగానే మీ ముఖం చందమామలా మెరిసిపోవాలంటే ఒక్క పసుపు చాలని అంటున్నారు నిపుణులు.

చర్మ సమస్యలు నయం కావడానికి చాలా మంది ముఖానికి పసుపు రాసుకుంటారు. ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు నయమవుతాయి. ముఖానికి పసుపు రాయడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది.

అయితే కొంతమంది నిమ్మకాయను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటారు. అయితే అలా చేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయట. ముఖ్యంగా పసుపు, నిమ్మకాయ మిశ్రమాన్ని ముఖం మీద పూయడం వల్ల మొటిమలు వస్తాయి. ఈ మొటిమలు పెద్ద సంఖ్యలో వస్తాయి. అందుకే ఈ రెండింటి మిశ్రమం చర్మానికి అస్సలు వినియోగించకూడదు.

మీరు పసుపు, నిమ్మకాయను కలిపి ముఖానికి పూయాలనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యులు మీకు సరిగ్గా మార్గనిర్దేశం చేస్తారు. మీ చర్మ తత్వానికి పసుపు, నిమ్మకాయను కలిపి అప్లై చేయాలా? వద్దా? అనే విషయం చెబుతారు.

నిమ్మరసం లేకుండా పసుపును మాత్రమే చర్మానికి అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అవసరమైతే పసుపుతో గంధం కలిపి కూడా అప్లై చేయవచ్చు. గంధం, పసుపు ఈ రెండు పదార్ధాలు చర్మానికి మేలు చేస్తాయి.




