AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ రెడీ..

ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో అతి పొడవైన టన్నెల్‌ ప్రారంభానికి సిద్ధమైంది. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఈ రహదారిని, త్వరలో ప్రధాని మోదీ జాతికి అంకితమివ్వనున్నారు.

ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ రెడీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2020 | 7:10 PM

Share

ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో అతి పొడవైన టన్నెల్‌ ప్రారంభానికి సిద్ధమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ, లద్దాఖ్‌లో లేహ్‌ను అనుసంధానించే ఈ సొరంగమార్గం..త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఈ రహదారిని ప్రధాని మోదీ జాతికి అంకితమివ్వనున్నారు.

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్‌ను నిర్మించారు. మనాలి, లేహ్‌ హైవేపై రోహ్తంగ్‌ పాస్ కింద..ఈ టన్నెల్‌ నిర్మాణానికి పదేళ్లు పట్టింది. ఈ సొరంగ మార్గంతో మనాలి-లేహ్‌ మధ్య దూరం సుమారు 46 కిలోమీటర్లు తగ్గనుంది. దీని ద్వారా 4గంటల సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు అధికారులు. ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని, భారత‌ రత్న అటల్ బిహారీ వాజ‌పేయి పేరు పెట్టారు. అటల్ రోహ్తంగ్ టన్నెల్‌గా పిలుస్తున్నారు.

2010 జూన్ 28న‌ ఈ టన్నెల్‌కు శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా..పదేళ్లు పట్టిందని వెల్లడించారు అధికారులు. దీనిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తోంది. సుమారు రూ. 4 వేల కోట్ల రూపాయలు వెచ్చించి, గుర్రపుడెక్క ఆకారంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను అనుస‌రించారు. టన్నెల్‌ లోపల ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా..ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ఏర్పాటుచేశారు.

ఈ సొరంగం లోపల ఏ వాహనమైనా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించేందుకు అవ‌కాశ‌ముంది. లదాఖ్‌లో మోహరించిన భారత సైనికుల‌కు ఈ టన్నెల్‌ ఎంతో ఉపయోగపడుతుందటున్నారు అధికారులు. శీతాకాలంలో ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా సులభమవుతుందని అంటున్నారు. ఈ నెల చివర్లో ప్రధాని మోదీ ఈ టన్నెల్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?