భర్త సర్కార్ కొలువుపై మోజుపడ్డ భార్య.. ఏం చేసిందో తెలిస్తే షాక్..!

ప్రభుత్వ ఉద్యోగం కోసం రైల్వే శాఖలో పనిచేస్తున్న తన భర్తను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 29 ఏళ్ల దీపక్ కుమార్ గొంతు కోసి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదిక నిర్ధారణ అయ్యింది. నజీబాబాద్‌లోని క్యారేజ్, వ్యాగన్ విభాగంలో పనిచేసే దీపక్, తన భార్య శివానితో కలిసి ఆదర్శ్ నగర్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.

భర్త సర్కార్ కొలువుపై మోజుపడ్డ భార్య.. ఏం చేసిందో తెలిస్తే షాక్..!
Accused Arrest

Updated on: Apr 08, 2025 | 3:37 PM

ప్రభుత్వ ఉద్యోగం కోసం దురాశతో రైల్వే శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ తాళికట్టిన భర్తనే హతమార్చింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆమె తన భర్తను హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నజీబాబాద్‌లో జరిగింది. అయితే ఆమె భర్త గుండెపోటుతో మరణించాడని అందరిని నమ్మించింది. చివరికి పోస్ట్ మార్టం నివేదికలో 29 ఏళ్ల దీపక్ కుమార్ గొంతు కోసి చంపారని నిర్ధారించారు. నజీబాబాద్‌లోని క్యారేజ్, వ్యాగన్ విభాగంలో పనిచేసే దీపక్, తన భార్య శివానితో కలిసి ఆదర్శ్ నగర్‌లోని అద్దె ఇంట్లో నివసించాడు. ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు.

గత శుక్రవారం(ఏప్రిల్ 4) దీపక్ గుండెపోటుకు గురయ్యాడని శివాని దీపక్ కుటుంబానికి చెప్పింది. దీపక్‌ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, తరువాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కానీ వైద్యులు అతన్ని చేర్చుకోవడానికి నిరాకరించారు. బిజ్నోర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.

దీపక్ మెడపై గాయాల గుర్తులను కుటుంబ సభ్యులు గమనించి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్‌మార్టం పరీక్షకు డిమాండ్ చేయడంతో అనుమానాలు తలెత్తాయి. అతను గొంతు కోసి హతమార్చినట్లు నివేదికలో నిర్ధారించారు. దీపక్ సోదరుడు పియూష్ అలియాస్ ముకుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు శివానితోపాటు గుర్తు తెలియని ఆమె సహచరుడిపై కేసు నమోదు చేశారు. శివానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో, శివాని దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించింది. కానీ చివరికి నేరం అంగీకరించింది. హత్య జరిగిన సమయంలో అతను భోజనం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆహారం ఇంకా అతని గొంతులోనే ఉంది. అతని గొంతు కోయడానికి తాడును ఉపయోగించారని పోలీసులు తెలిపారు. దీపక్ తొలుత మణిపూర్‌లోని CRPFలో పనిచేశాడు. 2023లో, అతను ఆ పదవిని వదిలి రైల్వేలో చేరాడు.

ఆమె కుటుంబంతో సంబంధాలు దెబ్బతినడంతో అతను ఇటీవల తన భార్యతో దూరంగా వెళ్లిపోయాడు. ఈ దంపతులకు వేదాంత్ అనే ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. మృతుడి డిపెండెంట్ స్కీమ్ కింద ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు శివాని ఈ హత్య చేసి ఉండవచ్చని ఆరోపణలు  ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..