ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్పై ఈసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్లో బిహార్ ఎన్నికలను నిర్వహించిన తీరును ప్రస్తావించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా. కరోనా సంక్షోభంలోనూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధులకు నివాళులర్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. 824 సీట్లకు ఎన్నికలు జరగనున్నట్టు సునీల్ అరోరా తెలిపారు. ఇందుకోసం 2.7లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. 824 సీట్లకు ఎన్నికలు జరగనున్నట్టు సునీల్ అరోడా వెల్లడించారు. ఇందుకోసం 2.7లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
బెంగాల్లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 40 వేల పోలింగ్ కేంద్రాల్ల, అసోంలో 33 వేల పోలింగ్ కేంద్రాల్లో, పుదుచ్చేరిలో 1,500 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారినే సిబ్బందిగా నియమించనున్నట్లు చెప్పారు. రోనా వ్యాప్తి నేపథ్యంలో.. డోర్-టు-డోర్ ప్రచారాలను నియంత్రిస్తున్నట్లు చెప్పారు. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కాగా 16 రాష్ట్రాల్లో 36 ఉపఎన్నిక స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. పోస్టల్ బ్యాలెట్ యథాతథంగా ఉంటుందని.. పోలింగ్ సమయం గంట పెంచుతున్నట్లు చెప్పారు. ఆన్లైన్ నామినేషన్లకు కూడా సీఈసీ అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ రాకతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొంత సులభమైనట్టు పేర్కొన్నారు సునీల్ అరోరా. తాజా పోలింగ్కు ముందే ఎన్నికల అధికారులందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.
కేరళలో ఏప్రిల్ 6న పోలింగ్..140 స్థానాలున్న కేరళకు ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మల్లాపురం ఉపఎన్నికలకు కూడా అదే రోజున పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు
బెంగాల్లో 8 విడతల్లో పోలింగ్
Also Read: అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్కు అరుదైన ఘనత.. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అతి తక్కువ సమయంలోనే…!