West Bengal Elections: నాలుగో విడతలో పోటీ చేసే అభ్యర్థుల్లో 22 శాతం నేరచరితులు.. నివేదికలో వెల్లడి

Bengal Elections: దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడతల పోటీ చేసే 372 మంది...

West Bengal Elections: నాలుగో విడతలో పోటీ చేసే అభ్యర్థుల్లో 22 శాతం నేరచరితులు.. నివేదికలో వెల్లడి

Updated on: Apr 04, 2021 | 1:14 PM

Bengal Elections: దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడతల పోటీ చేసే 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22 శాతం మంది తమపై క్రిమినల్‌ కేసులున్నట్లు ప్రకటించినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) ఒక నివేదికలో తెలిపింది. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 373 మంది అభ్యర్థుల్లో 372 మంది దాఖలు చేసిన నామ పత్రాల్లో ఏడీఆర్‌ పరిశీలించింది.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న అసంపూర్ణ అఫిడవిట్‌ కారణంగా సప్తగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బిష్ణు చౌదరి రికార్డులు విశ్లేషించలేకపోయినట్లు తెలిపింది. 372 మంది అభ్యర్థులు 81 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులున్నట్లు ప్రకటించారని, 65 మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయని వెల్లడించారని తెలిపారు.

మరో 65 మంది తాము కోటీశ్వరులమని పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. ప్రధాన పార్టీల్లో బీజేపీ నుంచి 27 మంది, కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి 17 మంది, ఎస్‌యూసీఐ (సీ) పార్టీ నుంచి ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించారని ఏడీఆర్‌ వెల్లడించింది. 19 మంది అభ్యర్థులు తమపై మహిళపై నేరారోపణలకు సంబంధించిన కేసులున్నట్లు ప్రకటించారు. నలుగురు అభ్యర్థులు తమపై అత్యాచారయత్నం కేసులున్నట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి: Tamil Nadu Elections: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు.. ముగిసిన ఎన్నికల ప్రచారం.. 6న పోలింగ్‌

West Bengal: ఊపందుకున్న బెంగాల్‌ ఎన్నికల ప్రచారం.. మార్కెట్లో హల్‌చల్‌ చేస్తోన్న మోదీ, మమతా స్వీట్‌ విగ్రహాలు

Konda Vishweshwar Reddy: తెలంగాణలో మరో కొత్త పార్టీ అవసరం… చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి