Madhyapradesh: ఉజ్జయినిలో వర్షం బీభత్సం..కూలిన మహాకాళేశ్వరుడి ఆలయం గోడ, ఇద్దరు భక్తులు మృతి, కొనసాగుతోన్న రెస్క్యూ

|

Sep 27, 2024 | 9:02 PM

ఉజ్జయినిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ వర్షం మహాకాళేశ్వర ఆలయ ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం గేట్ నంబర్ 4 వద్ద జ్యోతిషాచార్య పండిత ఆనంద్ శంకర్ వ్యాస్ ఇంటి సమీపంలో పాత గోడ కూలిపోయింది. గోడ దగ్గర సరుకులు అమ్ముకునే కొందరు ఈ శిధిలాల కింద చిక్కుకున్నారు. గోడ కూలిపోవడంతో కొంత మంది శిథిలాల కింద సమాధి అయ్యారని మహాకాళేశ్వర ఆలయ నిర్వాహకులకు సమాచారం అందింది.

Madhyapradesh: ఉజ్జయినిలో వర్షం బీభత్సం..కూలిన మహాకాళేశ్వరుడి ఆలయం గోడ, ఇద్దరు భక్తులు మృతి, కొనసాగుతోన్న రెస్క్యూ
Mahakaleswara Temple
Follow us on

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆలయం గేట్ నంబర్ 4 గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు. కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన భక్తులను రెస్క్యూ టీం వెంటనే శిథిలాల నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆలయం వద్ద రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు వేగంగా చేస్తున్నారు. ఉజ్జయినిలో భారీ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఉజ్జయినిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ వర్షం మహాకాళేశ్వర ఆలయ ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం గేట్ నంబర్ 4 వద్ద జ్యోతిషాచార్య పండిత ఆనంద్ శంకర్ వ్యాస్ ఇంటి సమీపంలో పాత గోడ కూలిపోయింది. గోడ దగ్గర సరుకులు అమ్ముకునే కొందరు ఈ శిధిలాల కింద చిక్కుకున్నారు. గోడ కూలిపోవడంతో కొంత మంది శిథిలాల కింద సమాధి అయ్యారని మహాకాళేశ్వర ఆలయ నిర్వాహకులకు సమాచారం అందింది.

వెంటనే స్పందించి.. సంఘటన గురించి పరిపాలనా అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బందిని వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహాకాళేశ్వర పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆలయ సిబ్బంది సహాయంతో శిథిలాల నుంచి క్షతగాత్రులను శిధిలాల నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో.. ఇంకా ఎంతమందిని రెస్క్యూ టీమ్ బయటకు తీయాల్సి ఉందో తెలియాల్సి ఉంది. రెస్క్యూ టీమ్ నిరంతరం రెస్క్యూ పనిలో నిమగ్నమై ఉంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్పీ ప్రదీప్ శర్మ ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

గోడ దగ్గర నిలబడి ఉన్న ప్రజలు

భారీ వర్షం కురుస్తోందని.. తాము గేట్ నంబర్ 4 వద్ద గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నామని సంఘటన ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అకస్మాత్తుగా గోడ కూలిపోవడంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గోడ కింద సమాధి అయ్యారు. గోడ కూలడంతో ఎంతమంది భక్తులు గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..