AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదనీ.. ఏకంగా తహసీల్దార్‌ వాహనంపై పెట్రోల్ పోసి, తగలెట్టాడు! వీడియో

పృథ్వీరాజ్‌ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు గత జులైలో ఓ ట్రిప్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లి జులై 2న చల్లకెరె పోలీసులను సంప్రదించింది. తన కుమారుడు కనిపించకుండా పోయాడని, మిస్సింగ్‌ కేసు తీసుకోవాలని తెల్పింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో చేసిదిలేక ఆమె వెనుదిరిగి..

Viral Video: ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదనీ.. ఏకంగా తహసీల్దార్‌ వాహనంపై పెట్రోల్ పోసి, తగలెట్టాడు! వీడియో
Man Sets Tehsildar's Vehicle
Srilakshmi C
|

Updated on: Sep 06, 2024 | 6:47 PM

Share

కర్ణాటక , సెప్టెంబర్‌ 6: కర్ణాటక రాష్ట్రంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తన తల్లి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో ఓ యువకుడు కోపోధ్రిక్తుడై ఏకంగా తహసీల్దార్‌ వాహనంపై పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టాడు. ఈ ఘటన చిత్రదుర్గలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

పృథ్వీరాజ్‌ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు గత జులైలో ఓ ట్రిప్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లి జులై 2న చల్లకెరె పోలీసులను సంప్రదించింది. తన కుమారుడు కనిపించకుండా పోయాడని, మిస్సింగ్‌ కేసు తీసుకోవాలని తెల్పింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో చేసిదిలేక ఆమె వెనుదిరిగి వెళ్లిపోయింది. కనిపించకుండా పోయిన పృథ్వీరాజ్‌ జులై 23న తిరిగొచ్చాడు. పోలీసులు తన తల్లి ఫిర్యాదును స్వీకరించని విషయాన్ని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

దీంతో జుల 23వ తేదీన పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం చల్లకెరె తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టాడు. కార్యాలయం ముందున్న తహసీల్దార్‌ వాహనంపైకి ఎక్కి, పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన కార్యాలయ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అనంతరం మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పృథ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా భయాందోళనలకు గురయ్యారు. కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)కి వినతిపత్రం సమర్పించారు. కాగా నిందితుడు పృథ్వీరాజ్‌పై ఈ ఏడాది ఆగస్టు 14న ఓ బైక్‌కు నిప్పంటించిన కేసులో ఇప్పటికే మరో కేసు నమోదైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?