AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్రిక్తతల వేళ భారత నేవీ సాహసం.. అరేబియా సముద్రంలో INS సూరత్ క్షిపణి పరీక్ష విజయవంతం

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తున్న వేళ, భారతదేశం సాహసోపేత ప్రయోగం చేసింది. ఏప్రిల్ 24 గురువారం నాడు భారత నావికాదళానికి చెందిన పూర్తి స్వదేశీ యుద్ధనౌక INS సూరత్ క్షిపణిని అరేబియా సముద్రంలోని లక్ష్యంపై విజయవంతంగా ప్రయోగించింది.

ఉద్రిక్తతల వేళ భారత నేవీ సాహసం.. అరేబియా సముద్రంలో INS సూరత్ క్షిపణి పరీక్ష విజయవంతం
Ins Surat Missile Test
Balaraju Goud
|

Updated on: Apr 24, 2025 | 9:45 PM

Share

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తున్న వేళ, భారతదేశం సాహసోపేత ప్రయోగం చేసింది. ఏప్రిల్ 24 గురువారం నాడు భారత నావికాదళానికి చెందిన పూర్తి స్వదేశీ యుద్ధనౌక INS సూరత్ క్షిపణిని అరేబియా సముద్రంలోని లక్ష్యంపై విజయవంతంగా ప్రయోగించింది. సముద్ర-స్కిమ్మింగ్ లక్ష్యాన్ని చేధించింది. ఈ పరీక్ష భారత నావికాదళం వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం వైపు మరో బలమైన అడుగు పటినట్లైంది.

INS సూరత్ అనేది భారత నావికాదళంతాజా గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక. ఇది పూర్తిగా భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక. ఈ నౌకలో ఆధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి. ప్రత్యక్ష కార్యాచరణ పరిస్థితుల్లో లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించడం ద్వారా ఇది తన సామర్థ్యాలను ప్రదర్శించింది. ఈ విజయంపై నావికాదళం కీలక ప్రకటన చేసింది. ‘మన సముద్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో భారత నావికాదళం నిబద్ధత, స్వావలంబనకు ఇది నిదర్శనం’ అని పేర్కొంది.

క్షిపణి సామర్థ్యం ఈ పరీక్షలో ఇజ్రాయెల్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి (MRSAM) ఉపయోగించడం జరిగింది. దీని పరిధి 70 కి.మీ. ఈ క్షిపణి శత్రు విమానాలు, డ్రోన్లు, గాల్లో ఎగురుతున్న క్షిపణులను నాశనం చేయగలదు. ఇదే సమయంలో, పాకిస్తాన్ అరేబియా సముద్రంలో నో-ఫ్లై జోన్ ప్రకటించింది. భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ కొత్త క్షిపణిని పరీక్షించడానికి సిద్ధమవుతున్నందున, అంతకుముందు రోజు అరేబియా సముద్రంలో నో-ఫ్లై జోన్ జారీ చేసింది. 480 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణిని పరీక్షించే అవకాశం ఉంది. పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ వైమానిక దళం అప్రమత్తంగా ఉందని వర్గాలు తెలిపాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ వైమానిక దళం అప్రమత్తంగా ఉందని మీడియా వర్గాలు తెలిపాయి. భారతదేశం సముద్ర శక్తిని పెంచడం ఐఎన్ఎస్ సూరత్ వంటి స్వదేశీ నౌకలు, వాటిలో అమర్చిన ఆధునిక ఆయుధాలు భారత నావికాదళం పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పరీక్ష శత్రువును నిరోధించే సామర్థ్యం పరంగా చాలా ముఖ్యమైనది. వ్యూహాత్మక ఆయుధాల పరంగా భారతదేశం కొత్త మైలురాయిని అందుకుందని ఇది రుజువు చేస్తుంది.

దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏమిటంటే శత్రువులకు బలమైన సందేశం ఇవ్వడం. ఈ పరీక్ష భారతదేశం అన్ని వైపులా సిద్ధంగా ఉందని పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకు స్పష్టమైన సందేశాన్ని పంపినట్లు అయ్యింది. భారతదేశంలో భాగంగా స్వదేశీ ఆయుధాలు, యుద్ధనౌకలు రక్షణ రంగంలో దేశాన్ని స్వావలంబన చేస్తున్నాయి. సముద్ర భద్రతను బలోపేతం చేస్తోంది. అరేబియా సముద్రంలో ఈ పరీక్ష భారతదేశ సముద్ర ప్రాంతాల భద్రతను మరింత పటిష్టం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..