AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరి శివారు పొలంలో యువకుడి శవం.. పక్కనే ఏడుస్తూ కనిపించిన యువతి.. ఆరా తీయగా..!

ఉత్తరప్రదేశ్‌లో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. సహారన్‌పూర్‌లో రోడ్డు పక్కన యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ఒక యువతి ఏడుస్తూ కనిపించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి, జరిగిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఊరి శివారు పొలంలో యువకుడి శవం.. పక్కనే ఏడుస్తూ కనిపించిన యువతి.. ఆరా తీయగా..!
Saharanpur murder mystery
Balaraju Goud
|

Updated on: Apr 06, 2025 | 3:31 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ని సహరాన్‌పూర్‌లో రోడ్డు పక్కన ఉన్న పొలంలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. అక్కడ ఒక యువతి డెడ్‌బాడీ పక్కనే కూర్చుని ఏడుస్తోంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కుర్ది ఖేడా గ్రామం నుండి బారుఘర్ కు వెళ్ళే దారిలో, రోడ్డు నుండి కొంత దూరంలో, గ్రామస్తులు ఒక యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని పక్కనే యువతి ఏడుస్తూ ఉండటం చూశారు. ఆ అమ్మాయి ఆ యువకుడి మృతదేహాన్ని ఒడిలో పట్టుకుని ఏడుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

మరణించిన యువకుడిని బారుగఢ్ నివాసి హమీద్ అలియాస్ భూరా కుమారుడు సమ్రేజ్‌గా గుర్తించారు. ఏడుస్తూ కనిపించిన బాలిక కుర్ది ఖేడాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రస్తుతం, యువకుడి మరణానికి గల కారణం స్పష్టంగా తెలియలేదు. దీని కారణంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

యువతీ యువకులు కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ యువకుడు, యువతి వేర్వేరు వర్గాలకు చెందినవారు. దీంతో కుటుంబ పెద్దలు వారి బంధాన్ని అంగీకరించలేదు. ఆ అమ్మాయికి అప్పటికే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దాని కారణంగా అతను మన వేదనకు గురయ్యాడు. అయితే ఆ యువకుడు ఆ అమ్మాయిని అర్థరాత్రి తనతో తీసుకొచ్చాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా ఆ యువకుడు ఊరి శివారులో విగతజీవిగా కనిపించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. యువకుడు ఎలా చనిపోయాడనేది పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..