
దేశంలో ఉగ్రవాద, తీవ్రవాద దాడులను ఎదుర్కోవడానికి కీలక ముందడుగు పడింది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ IED డేటా నిర్వహణ వ్యవస్థను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం (జనవరి 09) ప్రారంభించారు. వర్చువల్గా మనేసర్లోని NSG గారిసన్ నుండి డేటా సెంటర్కు శ్రీకారం చుట్టారు. దేశ అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని హోం మంత్రి అమిత్ షా అన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. NIDMS ను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. NIDMS ద్వారా, దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న వివిధ రకాల డేటాను కేంద్రీకరించి ఒకే వేదికపైకి తీసుకువస్తారు. ఇది పరస్పరం అనుసంధానించిన ఉగ్రవాద సంఘటనలను గుర్తించడం సులభతరం చేస్తుంది. దర్యాప్తు వేగవంతం చేస్తుంది. “ఒక దేశం, ఒక డేటా సెంటర్” దిశగా ఇది ఒక ప్రధాన అడుగుగా అభివర్ణించిన అమిత్ షా, ఏదైనా సంఘటనకు త్వరితంగా, మెరుగైన ప్రతిస్పందనను అందించడానికి సరైన సమయంలో ఏజెన్సీలకు ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.
NSG, ఇతర ఏజెన్సీలతో కలిసి గత 11 నెలలుగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిందని NSG డైరెక్టర్ జనరల్ బ్రిఘు శ్రీనివాసన్ అన్నారు. ఇది IED-సంబంధిత డేటా సేకరణ, ఏకీకరణ, పంపిణీని క్రమబద్ధీకరించే సురక్షితమైన డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ వ్యవస్థ IEDలకు (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్) సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట ఏకీకృతం చేస్తుంది. ఇది బాంబు పేలుళ్ల తర్వాత దర్యాప్తును సులభతరం చేస్తుంది. భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. NIDMS అనేది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పోలీసు దళాలు, ఇతర ఏజెన్సీలు నిజ సమయంలో సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతించే సురక్షితమైన డిజిటల్ ప్లాట్ఫామ్.
NSG పాత్రను ప్రశంసించారు అమిత్ షా. ఇది దేశంలోని జీరో టెర్రర్ ఫోర్స్ అని, ప్రతి సవాలును ఎదుర్కొంటూ తన పౌరులకు భద్రతను అందిస్తుందని అన్నారు. NSG 24×7 కార్యాచరణ సామర్థ్యాలు, ఉన్నత స్థాయి శిక్షణ కారణంగా, భారతదేశం అన్ని రకాల ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోగలదని ఆయన అన్నారు. బాంబు నిర్వీర్యం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో ప్రపంచవ్యాప్తంగా NSG తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. దీనిని భారతదేశానికి ప్రత్యేకమైన వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు.
దేశంలోని అనేక ప్రాంతాలలో ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు IEDలను ఉపయోగిస్తున్నాయి. ఈ కొత్త వ్యవస్థ అటువంటి దాడులను నిరోధించడానికి, వాటి ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, సకాలంలో చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ వేదిక దర్యాప్తు సంస్థలు గత కేసుల నుండి నేర్చుకోవడానికి, దాడి నమూనాలను గుర్తించడానికి, భవిష్యత్తు ముప్పులను అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది.
Today inaugurated via video conferencing, the National IED Data Management System (NIDMS) of the @nsgblackcats, a new tool that engages the power of data, building India's next-gen security shield against terror.
Collating an expansive pool of data on bombs on one digital… pic.twitter.com/eqTgHn4rca
— Amit Shah (@AmitShah) January 9, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..