హిమాచల్‌లో దారుణం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

| Edited By:

Aug 14, 2020 | 12:06 PM

హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మండీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మండీలోని హనోజీ దేవాలయం..

హిమాచల్‌లో దారుణం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
Follow us on

హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మండీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మండీలోని హనోజీ దేవాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహానాలపై కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుల్లూ మార్గంలో నిత్యవసర సరకులు తీసుకెళ్తున్న వాహానాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు.. దేవాలయం పక్కనే పార్కింగ్ చేసిన వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా స్థానిక కాలువలు పొంగిపొర్లుతున్నాయి. పాగల్‌ నాలా పొంగి ప్రవహిస్తోంది. దీంతో కుల్లూ జిల్లాలో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం