AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, పోలీసు సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పంథా చౌక్ లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఒక పోలీసు అమరుడయ్యాడు. అతడిని బాబూ రామ్ గా గుర్తించారు. మరణించిన ఉగ్రవాదులు పాక్ లష్కరే తోయిబాకు..

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, పోలీసు సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 11:01 AM

Share

జమ్మూ కాశ్మీర్ లోని పంథా చౌక్ లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఒక పోలీసు అమరుడయ్యాడు. అతడిని బాబూ రామ్ గా గుర్తించారు. మరణించిన ఉగ్రవాదులు పాక్ లష్కరే తోయిబాకు చెందినవారని భద్రతా దళాలు తెలిపాయి. ఘటన స్థలం వద్ద జవాన్లు. మందుగుండు సామాగ్రిని, ఇతర ఆయుధాలను  స్వాధీనం చేసుకున్నారు. పంథా చౌక్ ప్రాంతాన్ని మొత్తం వారు తమ అదుపులోకి తీసుకున్నారు.

నిన్న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.  మరికొందరు ఉగ్రవాదులు మాటు వేసి ఉండవచ్ఛునని ఊహించి గాలింపు జరుపుతున్న భద్రతా దళాలకు పంథా చౌక్ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు కన్పించారు.

Follow Us