దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

వారంతా దైవ దర్శనానికి వెళ్ళారు.. అక్కడ దర్శనం అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు.. ఈ క్రమంలోనే ఊహించని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కర్నాటకలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంంలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి చెందారు..

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
Road Accident

Updated on: Nov 05, 2025 | 10:35 AM

వారంతా దైవ దర్శనానికి వెళ్ళారు.. అక్కడ దర్శనం అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు.. ఈ క్రమంలోనే ఊహించని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కర్నాటకలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంంలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి చెందారు.. ఈ ఘటన కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో జరిగింది. వ్యాను, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60) అక్కడికక్కడే మరణించారు. వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జయింది.

సమచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us