Dantewada Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతం

|

Sep 03, 2024 | 1:43 PM

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గంటల తరబడి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Dantewada Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతం
Encounter
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గంటల తరబడి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ-బీజాపూర్‌ జిల్లా సరిహద్దులోని లోహగావ్‌ పెడియా అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నక్సలైట్లకు చెందిన పీఎల్ జీఏ కంపెనీ నంబర్ 2తో సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 10 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలతోపాటు ఎస్‌ఎల్‌ఆర్‌, 303, 12 బోర్‌ ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఆపరేషన్‌​లో పాల్గొన్న భద్రతా దళాలు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక చనిపోయిన మావోయిస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మొత్తంగా… మావోయిస్టుల ఏరివేత‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర స‌ర్కారు.. మ‌రిన్ని బ‌ల‌గాల‌తో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వరుస కూంబింగులు చేప‌డుతోంది. కేంద్ర బలగాలనూ రంగంలోకి దించుతోంది. మూకుమ్మడి దాడులు చేయడంలో సిద్ధహస్తులైన బ్లాక్‌ క్యాట్స్‌ను సైతం మావోయిస్టుల ఏరివేతలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..