‘చిన్నమ్మ’ ఔదార్యానికి ఇదో ఉదాహరణ

| Edited By:

Aug 07, 2019 | 11:46 AM

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉన్నంతకాలం పార్టీలకతీతంగా పనిచేసిన ఆమె గొప్ప నాయకురాలిగా పేరొందింది. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె అందించిన సేవలు మరవలేనివి. సుష్మా నుంచి సహాయం పొందిన వారు ఆమెను అమ్మ అని సంభోదించిన సందర్భాలు ఎన్నో. కాగా 2016లో సుష్మా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సమయంలో ఆమెకు తమ కిడ్నీని దానం చేసేందుకు ఎంతోమంది […]

‘చిన్నమ్మ’ ఔదార్యానికి ఇదో ఉదాహరణ
Follow us on

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉన్నంతకాలం పార్టీలకతీతంగా పనిచేసిన ఆమె గొప్ప నాయకురాలిగా పేరొందింది. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె అందించిన సేవలు మరవలేనివి. సుష్మా నుంచి సహాయం పొందిన వారు ఆమెను అమ్మ అని సంభోదించిన సందర్భాలు ఎన్నో.

కాగా 2016లో సుష్మా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సమయంలో ఆమెకు తమ కిడ్నీని దానం చేసేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు. వారిలో బీఎస్పీ పార్టీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ‘‘నేను బీఎస్పీ మద్దతుదారుడిని, ముస్లింను. కానీ నా కిడ్నీని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు తల్లి సమానులు. మిమ్మల్ని అల్లా చల్లగా చూడాలి’’ అని ట్వీట్ చేశాడు ముజిబ్ అన్సారీ అనే వ్యక్తి. దానికి స్పందించిన సుష్మా అతడికి కృతఙ్ఞతలు చెబుతూనే.. కిడ్నీకి మతం లేదంటూ పేర్కొన్నారు. కాగా ఆమెకు కిడ్నీని దానం చేసేందుకు అంతమంది ముందుకు వచ్చారంటే.. సుష్మాపై అందరికి ఉన్న గొప్పదనం ఏంటో తెలుస్తుంది. ఇది ఆమె ఔదార్యానికి సంబంధించిన ఒక్క ఉదాహరణ మాత్రమే. ఏదేమైనా సుష్మా మరణంతో భారతదేశం మరో గొప్ప నేతను కోల్పోయిందన్న మాత్రం జగమెరిగిన సత్యం.