ఏనుగును చంపినవారిపై కఠిన చర్యలు.. కేరళ సీఎం పినరయి విజయన్
కేరళలోని మళప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ కేసును పోలీసులతో బాటు..
కేరళలోని మళప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ కేసును పోలీసులతో బాటు అటవీ శాఖ కూడా దర్యాప్తు చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. కిల్లర్స్ ను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. క్రాకర్స్ తో కూడిన పైన్ యాపిల్ ని తినిపించడంతో ఈ గజరాజు తీవ్రంగా గాయపడి మరణించింది. తన గాయం నుంచి కొంతవరకైనా ఊరట పొందేందుకు వెల్లియార్ నదిలో చాలాసేపు నిలబడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. దీని మృతికి కారకులైనవారు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
Strict action will be taken against those who are responsible for killing the pregnant elephant. Forest department is probing the case and the culprits will be brought to book: Pinarayi Vijayan, Kerala CM on elephant’s death in Malappuram after being fed cracker-stuffed pineapple pic.twitter.com/G6AoUtJNFS
— ANI (@ANI) June 3, 2020
ఈ గజరాజం కడుపులోని బిడ్డ ..’అమ్మా ! నేను మనుషులను చూడలేను.. కానీ నువ్వు చూడగలిగావు’ అని అంటున్నట్టు… పలువురు గీసిన క్యారికేచర్లు వైరల్ అవుతున్నాయి. ఏనుగు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ అమానుషానికి పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ఏనుగు మనుషులను నమ్మి పొరబాటు చేసిందని వివేక్ రంజన్ అగ్నిహోత్రి కూడా ట్వీట్ చేశారు.
&
Maybe animals are less wild and humans less human. What happened with that #elephant is heartbreaking, inhumane and unacceptable! Strict action should be taken against the culprits. #AllLivesMatter pic.twitter.com/sOmUsL3Ayc
— Akshay Kumar (@akshaykumar) June 3, 2020
इस देश में गणेश की पूजा करते हैं और गजराज की हत्या करते हैं। वो भी गर्भवती जिसका नाम उमा देवी था। उमा देवी माने पार्वती।
ऐसे बनता है क्या कोई विश्व गुरु? pic.twitter.com/buUZfCT295
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 3, 2020