థాయిలాండ్ నుంచి స్వదేశానికి బయలుదేరిన 153 మంది భారతీయులు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వందే భారత్ మిషన్' చురుక్కుగా సాగుతుంది. కరోనా నేపథ్యంలో థాయ్లాండ్లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం 'వందే భారత్ మిషన్'లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ చురుక్కుగా సాగుతుంది. కరోనా నేపథ్యంలో థాయ్లాండ్లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన థాయ్లాండ్లోని భారత ఎంబసీ… “వందే భారత్ మిషన్లో భాగంగా ఇది థాయ్లాండ్ నుంచి ఇండియాకు వస్తున్న 12వ విమానం అని స్పష్టం చేశారు. ఏఐ 335 విమానం మంగళవారం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి 153 ప్రయాణికులతో బయల్దేరింది. ప్రవాసుల తరలింపులో సహకరిస్తున్న థాయ్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, థాయ్ ఇమ్మిగ్రేషన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొంది.
12th #VandeBharatMission flight from Thailand to India – AI 335 from Bangkok to Delhi departed with 153 pax. Mission team sent off pax. Thx to @MFAThai , Thai Immigtation, @MEAIndia , @MoCA_GoI & @airindiain pic.twitter.com/klsYVZ8hWQ
— India in Thailand (@IndiainThailand) September 1, 2020
కాగా, కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం మే 6న ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమాన్ని ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ మిషన్ ద్వారా వివిధ దేశాల నుంచి 12,60,118 మంది భారతీయులను స్వదేశానికి తరలించడం జరిగిందని తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వీబీఎం ఐదు దశలు పూర్తి చేసుకుని… సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరో విడతలోకి అడుగు పెట్టింది. ఈ ఆరో దశలో కూడా సాధ్యమైనంత వరకు విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకొస్తామని ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.