చైనాపై బీజేపీకే మా మద్దతు… బీఎస్పీ అధినేత్రి మాయావతి

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 7:32 PM

చైనా సమస్యపై బీజేపీకే తమ సపోర్ట్ అని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది ఎంతో..

చైనాపై బీజేపీకే మా మద్దతు... బీఎస్పీ అధినేత్రి మాయావతి
Follow us on

చైనా సమస్యపై బీజేపీకే తమ సపోర్ట్ అని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది ఎంతో ఆందోళనకరమన్నారు. భారత-చైనా బోర్డర్ సమస్యపై మేం కమలం పార్టీకి మద్దతునిస్తున్నాం..అయితే ఇది, కాంగ్రెస్ రెండూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం సరికాదు అని మాయావతి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకోవచ్ఛునన్నారు. మీలో మీరు ఇలా వాదులాడుకోవడం వల్ల ఇతర సమస్యలను, ఈ దేశ ప్రజలను విస్మరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో పరస్పర ఆరోపణలు మాని, దేశ భద్రతపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. వలస కార్మికుల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆమె విమర్శించారు. తమ పార్టీ ఏ పార్టీ చేతిలోనూ కీలుబొమ్మ కాదని, ఇది జాతీయ స్థాయిలో ఏర్పడిన పార్టీ అని మాయావతి పేర్కొన్నారు.