ఛత్తీస్‌గఢ్‌లో పురంధేశ్వరికి ఘన స్వాగతం.. మూడు రోజుల పర్యటన.. పూల వర్షం కురిపించిన బీజేపీ కార్యకర్తలు..

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల పార్టీ అధిష్టానం

ఛత్తీస్‌గఢ్‌లో పురంధేశ్వరికి ఘన స్వాగతం.. మూడు రోజుల పర్యటన.. పూల వర్షం కురిపించిన బీజేపీ కార్యకర్తలు..

Updated on: Dec 07, 2020 | 9:52 PM

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల పార్టీ అధిష్టానం ఆమెను ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఇంఛార్జ్‌గా నియమించిన సంగతి అందరికి తెలిసిందే. కాగా రాయ్‌పూర్‌లో తొలిసారిగా అడుగుపెటిన ఆమెకు సాదర స్వాగతం లభించింది.

మాజీ సీఎం రమణ్‌ సింగ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణుదేవ్‌, రాయ్‌పూర్‌ ఎంపీ సునీల్‌ సోనీజీ స్వయంగా వచ్చి రిసీవ్ చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఆమెపై పూలవర్షం కురిపించారు. అనంతరం పురంధేశ్వరి సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల ఇంఛార్జులతో పాటు పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పటిష్టతపై చర్చించారు. మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్న ఆమె పార్టీ నేతలతో విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ పెద్దలు ఆమెను ఘనంగా సన్మానించారు.