
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ శర్మిష్ఠ పనోలిని శుక్రవారం(మే 30) మధ్యాహ్నం హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. 22 ఏళ్ల లా విద్యార్థిని శర్మిష్ఠ ఆపరేషన్ సిందూర్ తర్వాత మతపరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది శర్మిష్ఠ. ఆ తరువాత విమర్శలు రావడంతో ఆమె వాటిని తొలగించారు. అయితే రెచ్చగొట్టేలా పోస్టులు చేసిన శర్మిష్ఠపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ పెరిగింది. దీంతో ఎట్టకేలకు ఆమె హర్యానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖులే లక్ష్యంగా, ఒక మతం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్, లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ను ప్రస్తావించి, అనేక మంది ప్రముఖులను, సినీ, రాజకీయవేత్తలను విమర్శిస్తూ శర్మిష్ఠ వీడియోలను పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో, శర్మిష్టపై కోల్కతాలో కేసు నమోదైంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆమెను గురుగ్రామ్లో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్టు వివాదాన్ని మరింత రగిలించింది.
ఈ కేసులో ట్రోలింగ్ ఎంతగా జరిగిందంటే, ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ తన పోస్ట్ను తొలగించి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె క్షమాపణ పోస్ట్ రాసి, నేను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని, రాసినవన్నీ నా వ్యక్తిగత భావాలేనని, నేను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, కాబట్టి ఎవరైనా బాధపడితే, దానికి క్షమించండి అని చెప్పింది. శర్మిష్ఠ పనోలి తన క్షమాపణ గురించి మాట్లాడుతూ, ఇక నుండి నా పబ్లిక్ పోస్ట్లలో జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. దయచేసి నా క్షమాపణను అంగీకరించండి అంటూ వేడుకుంది.
I do hereby tender my UNCONDITIONAL APOLOGY whatever was put are my personal feelings and i never intentionally wanted to hurt anybody so if anybody is hurt I’m sorry for the same. I expect co-operation and understanding. Henceforth, i will be cautious in my public post. Again…
— Sharmishta (@Sharmishta__19) May 15, 2025
శర్మిష్ఠ పనోలి కోల్కతాలోని ఆనందపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమె ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆమెకు ట్విట్టర్ Xలో 85,000 మంది ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్లో 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పూణేలోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో లా అభ్యసిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేయడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు ఆ వీడియోలో, ఆపరేషన్ సిందూర్పై హిందీ సినీ నటుల మౌనాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ పోస్ట్ను తొలగించే ముందు, AIMIM జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్తో సహా చాలా మంది ఆమె ఆరోపించిన వీడియోను షేర్ చేసి, ఆమె మతపరమైన భావాలను అవమానించారని, మత విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆమెను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, ఈ విషయంలో శర్మిష్టకు మద్దతుగా మాట్లాడిన వారిలో నటి, బీజేపీ ఎంపి కంగనా రనౌత్ మొదటివారు. ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి నాయకుడు అమిత్ మాలవీయ కూడా ఉన్నారు. వీరిద్దరూ అరెస్టును విమర్శించారు. చట్టం అమలు చేసిన తీరును ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో పోస్ట్ చేస్తూ, శర్మిష్ట ఆపరేషన్ సిందూర్ పై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారని పేర్కొంటూ ఆమెను సమర్థించారు. ఆమె వ్యాఖ్యలు కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించినప్పటికీ, ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి, బహిరంగ క్షమాపణ కూడా చెప్పిందని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ, ఆమెను అరెస్టు చేశారు. “టిఎంసి నాయకులు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లేదా హిందూ మతాన్ని మురికి మతం అని పిలిచినప్పుడు అరెస్టులు లేదా క్షమాపణలు ఎందుకు ఉండవు?” అని ప్రశ్నిస్తూ, చట్ట అమలులో ద్వంద్వ ప్రమాణాలను ఆయన ప్రశ్నించారు.
During Operation Sindoor, Sharmistha, a law student, spoke out, her words regrettable and hurtful to some. She owned her mistake, deleted the video and apologized. The WB Police swiftly acted, taking action against Sharmistha.
But what about the deep, searing pain inflicted… pic.twitter.com/YBotf34YYe
— Pawan Kalyan (@PawanKalyan) May 31, 2025
ఇదిలావుంటే, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో దుర్మార్గపు చర్యలు, ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతిని ఉల్లంఘించేలా రెచ్చగొట్టడం వంటి సంబంధిత సెక్షన్ల కింద పనోలిపై కేసు నమోదు చేసినట్లు కోల్కతా పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.
Sharmistha Panoli, just 22 years old, has been arrested and sent to 14-day judicial custody over a video she had already deleted and publicly apologised for on May 15. There have been no reports of communal unrest linked to her remarks, yet the Kolkata Police is acting with…
— Amit Malviya (@amitmalviya) June 1, 2025
శర్మిష్ఠ పనోలి తోపాటు ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు పంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి మాయమయ్యాయని కోల్కతా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీని తర్వాత, పోలీసులు ఈ విషయాన్ని కోర్టులో సమర్పించారు. కోర్టు ఆమె అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. శుక్రవారం కోల్కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్ నుండి అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..