Sabarimala Gold Dispute: శబరిమల బంగారు తాపడం వివాదంలో కీలక పరిణామం.. 10 మందిని విచారించనున్న సిట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బంగారం తాపడం వివాదంలో మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించింది సిట్‌. బంగారం మాయం వ్యవహారంలో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సిట్‌ నివేదిక ఆధారంగా 10 మంది నిందితులను విచారించబోతున్నారు.

Sabarimala Gold Dispute: శబరిమల బంగారు తాపడం వివాదంలో కీలక పరిణామం.. 10 మందిని విచారించనున్న సిట్‌
Sabarimala Gold Dispute

Updated on: Oct 21, 2025 | 3:28 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బంగారం తాపడం వివాదంలో మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించింది సిట్‌. బంగారం మాయం వ్యవహారంలో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సిట్‌ నివేదిక ఆధారంగా 10 మంది నిందితులను విచారించబోతున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ను సిట్‌ అరెస్ట్‌ చేసింది. అయితే.. తనను ట్రాప్‌ చేశారని ఉన్నికృష్ణన్‌ ఆరోపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

సిట్‌ ఎస్పీ శశిధరన్‌ సీల్డ్‌ కవర్‌లో మధ్యంతర నివేదికను హైకోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాలతో సిట్‌ బంగారం మాయం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది. ట్రావెన్‌కోర్ట్‌ బోర్డు మాజీ సభ్యులపై కూడా సిట్‌ కేసు నమోదు చేసింది. 2019లో బోర్డు సభ్యులుగా ఉన్నవాళ్ల పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. శబరిమల ఆలయం నుంచి 445 గ్రాముల బంగారం మాయం కావడం సంచలనం రేపింది.

గర్భగుడి బయట బంగారు ఫలకాలకు తాపడం దాతగా ఉన్న ఉన్నికృష్ణన్‌కు స్థిరమైన ఆదాయమే లేనట్టు గుర్తించారు. శబరిమల గోల్డ్‌ మాయం కావడంపై హైకోర్టులో ఇన్‌కెమెరా విచారణ జరుగుతోంది. ఎలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయరాదని మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..