AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతోన్న పాకిస్తాన్ సోదరి.. ఇంతకీ ఆమె ఎవరంటే.?

కమర్ మొహ్సిన్ షేక్ పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. 1981లో వివాహం తర్వాత భారతదేశానికి వచ్చారు. ఆమె 30 సంవత్సరాలకు పైగా ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారు. ఈ సంవత్సరం.. ఆమె ఓం, గణేశుడి డిజైన్లతో రెండు రాఖీలను తయారు చేశారు. తాను ఎప్పుడూ మార్కెట్ నుండి రాఖీలు కొననని, ప్రతి సంవత్సరం ఇంట్లో చేతితో రాఖీలు తయారు చేసుకుంటానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణికట్టుకు కట్టడానికి జాగ్రత్తగా ఒకదాన్ని ఎంచుకుంటానని ఆమె చెప్పారు.

30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతోన్న పాకిస్తాన్ సోదరి.. ఇంతకీ ఆమె ఎవరంటే.?
Rakhi To Pm Modi
Balaraju Goud
|

Updated on: Aug 06, 2025 | 10:00 AM

Share

ప్రతి సంవత్సరం రక్షా బంధన్ రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కట్టే కమర్ మొహ్సిన్ షేక్ మరోసారి సిద్ధమయ్యారు. తన చేతులతో రెండు రాఖీలను తయారు చేసి, ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఆహ్వానం కోసం వేచి చూస్తున్నారు.

కమర్ మొహ్సిన్ షేక్ పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. 1981లో వివాహం తర్వాత భారతదేశానికి వచ్చారు. ఆమె 30 సంవత్సరాలకు పైగా ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారు. ఈ సంవత్సరం.. ఆమె ఓం, గణేశుడి డిజైన్లతో రెండు రాఖీలను తయారు చేశారు. తాను ఎప్పుడూ మార్కెట్ నుండి రాఖీలు కొననని, ప్రతి సంవత్సరం ఇంట్లో చేతితో రాఖీలు తయారు చేసుకుంటానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణికట్టుకు కట్టడానికి జాగ్రత్తగా ఒకదాన్ని ఎంచుకుంటానని ఆమె చెప్పారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో స్వచ్ఛంద సేవకురాలిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రితో తన తొలి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు కమర్ మొహ్సిన్ షేక్. ఎలా ఉన్నారని ఒకసారి ఆమెను అడిగారు. ఆ చిన్న సంభాషణ మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సోదర-సోదరీమణుల బంధానికి నాంది పలికింది. ఆ రోజు నుండి, ఆమె ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ మణికట్టుకు రాఖీ కడుతోంది. మోదీ ఆమెను తన సోదరిగా అంగీకరించారు. గతంలో జరిగిన రక్షా బంధన్‌ రోజున నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ప్రార్థించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆ ప్రార్థన ఫలించినప్పుడు, మోదీ ఆమెను తదుపరి ఏ ఆశీర్వాదం ఇస్తారని అడిగారు. దానికి ఆమె భారత ప్రధానమంత్రి అవుతారని ఆశిస్తున్నానని, ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందని, ప్రస్తుతం మోదీ తన మూడవ సారి పదవీకాలంతో ప్రధాని పదవిలో ఉన్నారని ఆమె చెప్పారు. 2024 లో కమర్ మొహ్సిన్ షేక్ రక్షా బంధన్ కోసం ఢిల్లీకి వెళ్లలేకపోయారు. కానీ ఈ సంవత్సరం, ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆహ్వానం అందితే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు ప్రధాని కార్యాలయం అనుమతిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె తన భర్తతో కలిసి ప్రయాణం చేసి, తన చేతితో తయారు చేసిన రాఖీని ప్రధానమంత్రి మణికట్టుకు కట్టడం ద్వారా సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us