
కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ట్రైన్ మధ్యప్రదేశ్లోని లూనీరిచ్ఛా-విక్రమ్గఢ్ ఆలోట్ స్టేషన్ల మధ్యకు రాగానే తెల్లవాుజామున 5:15 గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజధాని ఎక్స్ప్రెస్-12431లో షార్ట్ సర్క్యూట్ వల్ల B-1 కోచ్లో మొదలైన మంటలు.. క్షణాల్లోనే మిగతా భోగీలకు వ్యాపించాయి. మంటలు గుర్తించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 2 బోగీలను మిగతా వాటి నుంచి విడదీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఇక వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై కోట పీఆర్వో ప్రకటన జారీ చేసింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. అయితే ప్రమాదం కారణంగా ఈ రూట్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ట్రాక్ను పునరుద్ధరిస్తున్నామని.. త్వరలోనే మళ్లీ రాకపోకలు మొదలవుతాయని తెలిపింది.
“The Burning Train” in #MadhyaPradesh
Panic onboard as fire breaks out in Coach B1 of the Hazrat Nizamuddin–Trivandrum Rajdhani Express between Alot and Luni Richha stations in Ratlam district.
68 passengers were inside the coach when flames spread within seconds. Quick action… pic.twitter.com/zYT0N527AB
— Ravish Pal Singh (@ReporterRavish) May 17, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.