Rajasthan: 3 లీటర్ల పాలు స్మగ్లింగ్ చేస్తూ యువకుడు అరెస్ట్.. వీటి ధర లక్షల్లోనే.. ఎందుకంత స్పెషల్ అంటే
రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఒక యువకుడి నుంచి పోలీసులు 3 కిలోల పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పాలు బైక్ ట్యాంక్లో దొరికాయి. ఈ పాల ధర మార్కెట్లో రూ.15 లక్షలు. ఆ యువకుడు కూడా బైక్ ట్యాంక్ కింద దాచిపెట్టి ఈ పాలను తీసుకెళ్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని చెక్ చేసి పాలను స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్లోని పాలి జిల్లాలో పోలీసులు ఒక యువకుడి నుండి మూడు లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పాల ధర మార్కెట్లో రూ.15 లక్షలు. ఆ యువకుడు బైక్ ట్యాంక్ కింద దాచిపెట్టి ఈ పాలను తీసుకెళ్తున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకుని పాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షలు విలువ జేసే ఈ పాలకున్న ప్రత్యేకత ఏమిటంటే.. ఎందుకు అంత ఖరీదైనవో తెలుసుకుందాం..
నిజానికి ఈ పాలు నల్లమందు పాలు. ఆ యువకుడు ఈ పాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. అతను పాలి నుంచి జోధ్పూర్కు పాలు తీసుకెళ్తున్నాడు. అయితే మార్గమధ్యలో రోహత్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో ఆ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ యువకుడు పాలను బైక్ ట్యాంక్ కింద చాలా రహస్యంగా దాచిపెట్టాడు.. అయినా అతను పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు. పట్టుబడ్డాడు.
ఈ కేసు గురించి సమాచారం ఇస్తూ.. అరెస్టయిన యువకుడు నల్లమందు పాల అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమ బృందానికి సమాచారం అందిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) దినేష్ ఎంఎన్ అన్నారు. ప్రజలు ఈ పాలను మత్తులోకి వెళ్లేందుకు ఉపయోగిస్తారు. మార్కెట్లో ఈ పాల ధర కూడా లక్షల రూపాయల్లోనే ఉంటుంది.
మార్కెట్లో పాల ధర రూ. 15 లక్షలు.
సమాచారం అందుకున్న పాలి జిల్లా రోహత్ పోలీసులు, ప్రతాప్గఢ్ జిల్లా రథజ్ఞ పోలీస్ స్టేషన్ నివాసి కృష్ణపాల్ సింగ్ సిసోడియా (35) అనే వ్యక్తిని పానిహారి కూడలి వద్ద అరెస్టు చేశారు. పోలీసులు కృష్ణపాల్ బైక్ను తనిఖీ చేసినప్పుడు.. వారికి మూడు కిలోల నల్లమందు పాలు దొరికాయి, దీని విలువ మార్కెట్లో దాదాపు రూ. 15 లక్షలు.
పోలీసులు కృష్ణపాల్ సింగ్ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు.. అతను తన బైక్ను తీసుకొని రోహత్ పట్టణం వైపు పారిపోయాడని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) దినేష్ ఎంఎన్ తెలిపారు. పోలీసులు అతడిని వెంబడించారు. ఓం బన్నా సరిహద్దు వద్ద బందాయ్ పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు. బైక్ను సోదా చేయగా.. అతను నల్లమందు పాలను ట్యాంక్ కింద రహస్య ప్రదేశంలో దాచిపెట్టినట్లు కనుగొన్నాడు.
నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు
స్మగ్లర్ కృష్ణపాల్ కు చెందిన నల్లమందు పాలు, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు దినేష్ ఎంఎన్ తెలిపారు. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి.. అతన్ని కూడా అరెస్టు చేశారు. విచారణలో జోధ్పూర్లో నల్లమందు పాలు సరఫరా చేయడానికి గ్రామ నివాసి ముఖేష్ పాటిదార్ తనను పంపాడని క్రిషన్ పాల్ చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








