Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!

Silly Robbery: సమయంలో అర్థరాత్రి 12 గంటలవుతోంది. నడిరోడ్డుపై ఒక్కడే అటూ ఇటూ తిరుగుతున్నాడు. రోడ్డుకు ఇరువైపులా కొన్ని కిరాణాషాపులు ఉన్నాయి. మనసులోని కోరిక మేరకు..

Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 01, 2022 | 7:23 PM

Silly Robbery: సమయంలో అర్థరాత్రి 12 గంటలవుతోంది. నడిరోడ్డుపై ఒక్కడే అటూ ఇటూ తిరుగుతున్నాడు. రోడ్డుకు ఇరువైపులా కొన్ని కిరాణాషాపులు ఉన్నాయి. మనసులోని కోరిక మేరకు కొన్ని షాపులను టార్గె్ట్ చేసుకున్నాడు. ఇంకేముంది.. అదును చూసి ఒక్కో షాపులో దూరిపోయాడు. మూడు దుకాణాల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. మరి ఇంత పకడ్బందీగా చోరీకి పాల్పడ్డాడు అంటే.. భారీగా దోచుకెళ్లాడనే భావన సహజంగానే వస్తుంది. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ దొంగ మూడు షాపుల్లో చోరీకి పాల్పడి.. కేవలం 20 రూపాయలు మాత్రమే ఎత్తుకెళ్లాడు. అది కూడా ఎందుకోసమో తెలుసా?.. కరకరలాడే చిప్స్ తినాలనిపించి.. ఆ చోరీకి పాల్పడ్డాడట. ఈ విచిత్ర దొంగతనం.. రాజస్థాన్‌లోని సికర్ జిల్లా ఫతేపూర్‌లో వెలుగు చూసింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేపూర్‌లో దుర్గా మార్కెట్‌లో గుర్తు తెలియని వ్యక్తి మూడు షాపుల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆ విజువల్స్ ఆధారంగా నిందితుడు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ దొంగకు టైమ్ పాస్ కోసం చిప్స్ తినాలని అనిపించిందట. తన వద్ద డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ క్రమంలోనే.. అతను మూడు షాపుల్లో చోరీకి పాల్పడ్డాడు. మరి మూడు షాపుల తాళాలు పగులగొట్టి అతను ఎత్తుకెళ్లింది కేవలం 20 రూపాయలు మాత్రమే అని తెలుసుకుని పోలీసులు బిత్తరపోయారు. అయితే, అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతనికి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని సబ్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ సింగ్ తెలిపారు. చోరీకి పాల్పడిన విషయాన్ని నిందితుడు అంగీకరించాడని, అయితే అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుల సహకారంతో అతనికి చికిత్స అందించాల్సి ఉందని ఎస్సై చెప్పారు.

Also read:

IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఆరోజు నుంచి స్టేడియాల్లో..

తాలిబాన్‌ను తేలికగా తీసుకోకూడదు.. 9/11 పునరావృతం కావచ్చు.. ఇంటర్య్వూలో అఫ్ఘాన్ మహిళ సంచలన వ్యాఖ్యలు!

Prakasam District: సమాధి తవ్వి చనిపోయిన బిడ్డకు పాలు పట్టిన తల్లి.. గుండెలు పిండేసే ఘటన

వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్స్ చేసిన యువకుడు
వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్స్ చేసిన యువకుడు
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. మరోవారంలోనే పరీక్షల ఫలితాల!
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. మరోవారంలోనే పరీక్షల ఫలితాల!
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..