Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: ఇంకా గుర్తించని 83 మృతదేహాలు.. చివరికి దాని సహాయంతో గుర్తిస్తున్న అధికారులు

ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మృతుల్లో 83 మందిని ఇంకా గుర్తించలేదు. అందుకోసం రైల్వేశాఖ అధునాతన సాంకేతికత వైపు ఆధారపడుతోంది. వేలిముద్రలు, సిమ్‌కార్డు సహా ఏదైన చిన్న ఆధారం దొరికినా మృత దేహాలను అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోంది.

Odisha Train Accident: ఇంకా గుర్తించని 83 మృతదేహాలు.. చివరికి దాని సహాయంతో గుర్తిస్తున్న అధికారులు
Odisha Train Accident
Follow us
Aravind B

|

Updated on: Jun 08, 2023 | 12:39 PM

ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మృతుల్లో 83 మందిని ఇంకా గుర్తించలేదు. అందుకోసం రైల్వేశాఖ అధునాతన సాంకేతికత వైపు ఆధారపడుతోంది. వేలిముద్రలు, సిమ్‌కార్డు సహా ఏదైన చిన్న ఆధారం దొరికినా మృత దేహాలను అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోంది. మొదటగా మృతుల వేలి ముద్రలు సేకరించి.. వారి ఆధార్ కార్టు వివరాల ద్వారా కుటుంబ సభ్యలు గురించి తెలుసుకునేందుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) బృందాన్ని బాలేశ్వర్‌కు పలిపించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రమదంలో చాలామంది చేతి వేళ్లు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఇది ఫలించలేదు.

ఇప్పుడు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సంచార్ సాథీ పోర్టల్‌ను వినియోగిస్తున్నారు. 64 మృతదేహాలను ఈ పోర్టల్‌ ఆధారంగా పరీక్షించగా 45 కేసుల్ని విజయవంతంగా గుర్తించారు. వినియోగదారులు తమ పేరుపై ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునేందుకు, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్లను బ్లాక్‌ చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఉద్దేశించిన విషయం తెలిసిందే. ఐటీ శాఖకూ మంత్రిగా ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవే దీనిని ఈ మధ్యే ప్రారంభించారు. మృతుల ఫొటోల ఆధారంగా వారి ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ వివరాలను ఈ పోర్టల్‌ బయటపెట్టింది. వీటి ఆధారంగానే కుటుంబ సభ్యుల్ని సంప్రదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు అక్కడి సెల్‌ఫోన్‌ టవర్ల ద్వారా ఏయే కాల్స్‌ వెళ్లాయో తెలుసుకుని, ఆ తర్వాత ఆగిపోయిన ఫోన్లతో ఆ వివరాలను క్రోడీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..