చర్చలు, దౌత్యంతోనే సమస్యలకు పరిష్కారం.. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌..!

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వివాదం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచింది. యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య సంభాషణ సందర్భంగా, ప్రధాని మోదీ భారతీయుల భద్రతతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు.

చర్చలు, దౌత్యంతోనే సమస్యలకు పరిష్కారం.. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌..!
Pm Narendra Modi Iran President Masoud Pezeshkian

Updated on: Mar 13, 2026 | 8:00 AM

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వివాదం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచింది. యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య సంభాషణ సందర్భంగా, ప్రధాని మోదీ భారతీయుల భద్రతతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్‌లో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో తన ఫోన్ సంభాషణ వివరాలను వెల్లడించారు.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితిపై ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో తాను చర్చించానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరుల భద్రత, ఇంధన రవాణా అవసరం భారతదేశ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. “ఇరాన్ అధ్యక్షుడితో కీలక అంశాలపై చర్చించాను. శాంతి, స్థిరత్వానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించాను. ఇరువురి మధ్య దౌత్యం కోసం విజ్ఞప్తి చేశాను” అని ఆయన అన్నారు. అంతకుముందు, భారతదేశం – ఇరాన్ విదేశాంగ మంత్రులు గత కొన్ని రోజుల్లో మూడు దఫాలుగా చర్చలు జరిపారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నిజానికి, ప్రధానమంత్రి మోదీ, ఇరాన్ అధ్యక్షుడి మధ్య జరిగిన చర్చల తర్వాత, చమురు, గ్యాస్ సంక్షోభం నుండి భారతదేశం ఉపశమనం పొందుతుందని భావిస్తున్నారు. చమురు, ఇతర వస్తువుల తరలింపులో ఇరాన్ సహాయం అందించాలని ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడిని కోరారు. ఆ మార్గంలో భారత పౌరులు, భారతీయ వస్తువులను తీసుకువెళుతున్న ఓడల భద్రత గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. ఇరాక్‌లో ఒక అమెరికన్ నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన సంగతి తెలిసిందే.. ఇరాన్ ఇప్పటికే చైనాకు నౌకలను రవాణా చేయడానికి అనుమతిస్తుంది. అలాగే భారతదేశానికి చెందిన నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. వాటిపై IRGC దాడి చేయదని స్పష్టం చేశారు.

గురువారం (మార్చి 12) నాడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ తొలిసారిగా ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. హార్ముజ్ జలసంధి ప్రస్తుతానికి మూసివేస్తు్న్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన గల్ఫ్ అరబ్ పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గల్ఫ్ దేశాలకు అక్కడి అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని పిలుపునిచ్చారు. అమెరికా స్థావరాలపై దాడి జరుగుతుందని, పిల్లలను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని అమెరికా స్థావరాలను మూసివేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us