‘ప్లీజ్ ! నా డబ్బు తీసుకుని నా కేసు క్లోజ్ చేయండి’.. విజయ్ మాల్యా

| Edited By: Anil kumar poka

May 14, 2020 | 10:46 AM

ఇండియాలో వివిధ బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్ చెక్కేసిన లిక్కర్ కింగ్విజయ్ మాల్యా.. తన 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న అభ్యర్థనను అంగీకరించాలని, తనపై గల కేసును క్లోజ్ చేయాలనీ కోరారు..

ప్లీజ్ ! నా డబ్బు తీసుకుని నా కేసు క్లోజ్ చేయండి.. విజయ్ మాల్యా
Follow us on

ఇండియాలో వివిధ బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్ చెక్కేసిన లిక్కర్ కింగ్విజయ్ మాల్యా.. తన 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న అభ్యర్థనను అంగీకరించాలని, తనపై గల కేసును క్లోజ్ చేయాలనీ కోరారు. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించినందుకు ‘కంగ్రాట్స్’ చెబుతూ.. నా రుణాలు చెల్లిస్తానని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకూడా,లేదని వాపోయారు. ‘ప్రభుత్వం ఎన్ని కరెన్సీ నోట్లయినా ముద్రించుకోవచ్చు. కానీ నా లాంటి ‘చిన్న చెల్లింపుదారుడు’ నా 100 శాతం అప్పులు తీరుస్తానన్నా పట్టించుకోవడం లేదు’ అని మాల్యా ట్వీట్ చేశారు. దయచేసి బేషరతుగా నా డబ్బు తీసుకుని కేసు క్లోజ్ చేయండి’ అని అభ్యర్థించారు. తనను అప్పగించాలని భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో ఆయన వేసిన అప్పీలును కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మాల్యా సుప్రీంకోర్టుకెక్కారు. ఇండియాలోని ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్ చేశాయి.