Lockdown: మే 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ పోస్ట్.. అసలు నిజమిదే.!

|

May 01, 2021 | 3:31 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా..

Lockdown: మే 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ పోస్ట్.. అసలు నిజమిదే.!
Follow us on

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇక దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఆ వార్తలన్నీ కూడా అవాస్తవమేనని కొట్టిపారేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ వేదికగా స్పష్టతను ఇచ్చింది.

కరోనా నేపథ్యంలో మే 3వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తారని సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. పూర్తిగా అవాస్తవమని.. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏమి చేయలేదని పీఐబీ ట్విటర్ ద్వారా పేర్కొంది. కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల 20వ తేదీన ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లాక్ డౌన్ చివరి ఆప్షన్ అని చెప్పుకొచ్చారు. ఇక అప్పటి నుంచి లాక్ డౌన్ ఉంటుందంటూ ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా పీఐబీ స్పష్టత ఇస్తూ.. ఈ వార్తలన్నీ ఫేక్ అని.. ఇలాంటి ప్రకటనలు ప్రజలు నమ్మి మోసపోవద్దని పేర్కొంది. కాగా, కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించిన సంగతి తెలిసిందే.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!