
1976 తర్వాత ఏ ప్రధానమంత్రీ టచ్ చెయ్యని డీలిమిటేషన్ ప్రక్రియను 50 ఏళ్ల తర్వాత చేతికందుకున్నారు ప్రధాని మోదీ. తారీఖ్ పే తారీఖ్, తారిక్ పే తారిఖ్.. వాయిదా పడుతూ 30 ఏళ్లుగా అటకెక్కి కూర్చున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా దుమ్ము దులిపి, టేబుల్ మీద పెట్టింది ఎన్డీఏ సర్కార్. కానీ, ఈ రెండింటి ఫ్యూచర్పై మళ్లీ మిస్టరీగా మారిందా? ఎన్డీఏ, ఇండీ కూటముల మైండ్గేమ్ ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం.. తమిళనాడు, బెంగాల్ లాంటి ఎన్డీఏ హార్డ్కోర్ వ్యతిరేక రాష్ట్రాల్లో డీలిమిటేషన్ బిల్లు కాగితాలు మంటల్లో తగలడుతుంటే.. అవే బిల్లు కాగితాలు దేశ అత్యున్నత సభ టేబుళ్లపై సగర్వంగా మెరిశాయి. జనాభా లెక్కింపును, బీసీ రిజర్వేషన్ల డిమాండ్ను తప్పించుకోడానికి ప్రభుత్వం ఎస్కేపిజం పాలసీతో ముందుకెళ్తోందని అపోజిషన్ పార్టీ అంటోంది. మీకు పెద్ద మనసు లేదు, అందుకే, మహిళా సాధికారతను స్వాగతించడం లేదని అధికారపక్షం పెట్టిన శాపనార్థాలతో మొదలైంది.. ది హిస్టారికల్ డే ఇన్ పొలిటికల్ ఇండియా.. ఏప్రిల్ సిక్స్టీన్ 2016. ఉదయం 11 గంటలకు న్యాయశాఖ మంత్రి, హోంమంత్రి మూడు బిల్లులను లోక్సభ ముందు పెట్టి, చర్చిద్దాం రండి అని పిలుపునిచ్చారు. కానీ, బిల్లుల ప్రవేశాన్నే వ్యతిరేకించాయి విపక్షాలు. డివిజన్ ఓటింగ్కు పట్టుబట్టాయి. స్పీకర్ ఓం...