కుల్‌భూషణ్ కేసులో లాయర్‌కు ఇంకా లభించని అనుమతి

పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత రిటైర్డ్ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఇంకా ఆలస్యమవుతోంది. భారత హైకమిషన్ అధికారులు ఈమేరకు చేసిన ప్రయత్నాలు శనివారం కూడా ఫలించలేదు. టెర్రరిజం, గూఢచర్యం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈకేసులో ఉరిశిక్షను సవాల్ చేస్తూ భారత్ ..హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)ను ఆశ్రయించింది. ఈ కేసులో ఈ కేసుపై సమర్థవంతంగా సమీక్ష, పునఃపరిశీలన చేయాలని పాక్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ […]

కుల్‌భూషణ్ కేసులో లాయర్‌కు ఇంకా లభించని అనుమతి

Edited By:

Updated on: Aug 04, 2019 | 11:55 AM

పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత రిటైర్డ్ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఇంకా ఆలస్యమవుతోంది. భారత హైకమిషన్ అధికారులు ఈమేరకు చేసిన ప్రయత్నాలు శనివారం కూడా ఫలించలేదు. టెర్రరిజం, గూఢచర్యం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది.

ఈకేసులో ఉరిశిక్షను సవాల్ చేస్తూ భారత్ ..హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)ను ఆశ్రయించింది. ఈ కేసులో ఈ కేసుపై సమర్థవంతంగా సమీక్ష, పునఃపరిశీలన చేయాలని పాక్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు జూలై 17న ఆ ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఐసీజే సూచనమేరకు జైలులో ఉన్న జాదవన్‌ను కలిసేందుకు న్యాయవాదిని అనుమతించాలని భారత్ పాక్ ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని పరిమితుల మధ్య పాక్ అధికారుల సమక్షంలోనే న్యాయవాది కుల్‌భూషణ్‌ను కలిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. దీనిపై పాక్ విదేశాంగ కార్యాలయం కూడా శుక్రవారం అనుమతి మంజూరు చేసినా అయినప్పటికీ శనివారం వరకు జాదవ్‌ను భారత్ తరపు న్యాయవాదిని కలిసేందుకు మాత్రం అనుమతి ఇవ్వడంలో తీవ్ర జాప్య జరుగుతోంది.