తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం ఓపీఎస్‌ భేటీ..!

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, AIADMK వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్త O. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి M.K. స్టాలిన్‌ను స్వయంగా కలుసుకుని మాట్లాడారు. 2026-2027 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను 17వ తేదీన తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో ఓ. పన్నీర్‌సెల్వం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం స్టాలిన్‌ను స్వయంగా కలిసి కొన్ని నిమిషాలు మాట్లాడారు.

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం ఓపీఎస్‌ భేటీ..!
Ops Meets Stalin

Updated on: Feb 20, 2026 | 2:59 PM

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, AIADMK వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్త O. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి M.K. స్టాలిన్‌ను స్వయంగా కలుసుకుని మాట్లాడారు. 2026-2027 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను 17వ తేదీన తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ చర్చకు మంత్రులు తంగం తెన్నరసు, ఎంఆర్‌కె పన్నీర్‌సెల్వం సమాధానమిస్తున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే మంత్రుల ప్రతిస్పందనలను పట్టించుకోలేదు. పైగా స్టాలిన్ పాలన బాగుంది అంటూ పన్నీ్ర్ సెల్వం ప్రశంసలు కురింపించారు

ఇదే సమయంలో ఓ. పన్నీర్‌సెల్వం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం స్టాలిన్‌ను స్వయంగా కలిసి కొన్ని నిమిషాలు మాట్లాడారు. స్టాలిన్-ఓపీఎస్ సమావేశం తర్వాత, ఓపీఎస్ డీఎంకే పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్న తలెత్తింది. ఓపీఎస్ మద్దతుదారులు ఒక్కొక్కరుగా ఆయనను వదిలిపెడుతున్నందున, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us