Delhi: భర్తకు బాసటగా పని చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ..!

|

Mar 16, 2023 | 12:36 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తకు ఆసరగా ఉండేందుకు పని చేయాలనుకున్న మహిళను ఆమె మామ ఇటుక రాయితో తల పగలగొట్టాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Delhi: భర్తకు బాసటగా పని చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ..!
Man Attack
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తకు ఆసరగా ఉండేందుకు పని చేయాలనుకున్న మహిళను ఆమె మామ ఇటుక రాయితో తల పగలగొట్టాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య ఢిల్లీలో నివసిస్తున్న ప్రవీణ్ కుమార్, కాజల్ దంపతులు. ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా తమ వెంటే ఉంటున్నారు.

అయితే, ప్రవీణ్ ఒక్కడే శ్రమించడానికి చూడలేకపోయిన అతని భార్య కాజల్.. తాను కూడా పని చేసి భర్తకు బాసటగా నిలవాలనుకుంది. అయితే, కాజల్ నిర్ణయం ఆమె మామకు ఆగ్రహాన్ని కలిగించింది. అతను వారించినా ఆమె వినలేదు. ఇంటర్వ్యూ కోసం బయలుదేరింది కాజల్. దాంతో మరింత ఆగ్రహానికి గురైన మామ.. రోడ్డుపైనే ఇటుక రాయి తీసుకుని బలంగా తలపై కొట్టాడు. కాజల్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. వెంటపడి మరీ కొట్టాడు. ఈ ఘటనలో కాజల్ తీవ్రంగా గాయపడింది. దాంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..