AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: కాంగ్రెస్ కు నిధుల కొరత.. ఖర్గే కామెంట్స్ వైరల్

ప్రజలు విరాళాలు ఇచ్చిన డబ్బును ఉంచిన బ్యాంకు ఖాతాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్తంభింపజేసిందని, ఆదాయపు పన్ను శాఖ ఆ పార్టీకి భారీ జరిమానాలు విధించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

Congress: కాంగ్రెస్ కు నిధుల కొరత.. ఖర్గే కామెంట్స్ వైరల్
Mallikarjun Kharge
Balu Jajala
|

Updated on: Mar 14, 2024 | 9:55 AM

Share

ప్రజలు విరాళాలు ఇచ్చిన డబ్బును ఉంచిన బ్యాంకు ఖాతాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్తంభింపజేసిందని, ఆదాయపు పన్ను శాఖ ఆ పార్టీకి భారీ జరిమానాలు విధించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కలిసికట్టుగా నిలబడి రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి కృషి చేయాలని ఖర్గే పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని పేర్కొన్న ఖర్గే.. బిజెపి కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని, ఆదాయపు పన్ను ద్వారా పార్టీకి భారీ జరిమానాలు విధించిందని ఆరోపించారు, అయితే “సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమకు వచ్చిన వేలాది కోట్ల రూపాయల వివరాలను వెల్లడించడానికి వారు సిద్ధంగా లేరు” అని ఖర్గే ఆరోపించారు. ప్రజలు విరాళాలుగా ఇచ్చిన మా పార్టీ డబ్బును స్తంభింపజేశారు, ఖర్చు చేయడానికి మా వద్ద డబ్బు లేదు. అయితే బీజేపీ తమకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల గురించి వెల్లడించడం లేదు. ఎందుకంటే వారి కుట్రలు బయటపడుతాయి’’ ఖర్గే మండిపడ్డారు.

2019 ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన కలబుర్గి (గుల్బర్గా) ప్రజలు తమ తప్పును సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గుల్బర్గాలో బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ చేతిలో ఖర్గే 95,452 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

బీజేపీ ఈ రోజుల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందని, దీనిపై పోరాడాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “అది నీ హక్కుకు సంబంధించిన విషయం.. బీజేపీ (రాజ్యాంగాన్ని మార్చడానికి) ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే వారితో తమకు ఎటువంటి సంబంధం లేదని బిజెపి చెబుతోంది, కానీ అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదు” అని ఖర్గే అన్నారు.

Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ