AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చెన్నైలో దారుణం.. ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో హోటల్ సూపర్ వైజర్ హత్య

మనుషుల్లో మానవత్వం చనిపోతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ప్రాణాలు తీస్తున్నారు. ఓ హోటల్ లో ఎక్స్ ట్రా సాంబర్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన చెన్నైలోని జరిగింది. మంగళవారం రాత్రి పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో అదనపు సాంబార్ అడిగినందుకు జరిగిన గొడవలో హోటల్ సూపర్ వైజర్ (29)ను తండ్రీకొడుకులు హత్య చేశారు.

Viral News: చెన్నైలో దారుణం.. ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో హోటల్ సూపర్ వైజర్ హత్య
Death
Balu Jajala
|

Updated on: Mar 14, 2024 | 10:18 AM

Share

మనుషుల్లో మానవత్వం చనిపోతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ప్రాణాలు తీస్తున్నారు. ఓ హోటల్ లో ఎక్స్ ట్రా సాంబర్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన చెన్నైలోని జరిగింది. మంగళవారం రాత్రి పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో అదనపు సాంబార్ అడిగినందుకు జరిగిన గొడవలో హోటల్ సూపర్ వైజర్ (29)ను తండ్రీకొడుకులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనగపుత్తూరులోని పరిగర్ కు చెందిన శంకర్ (55), అతని కుమారుడు అరుణ్ కుమార్ (30) ఇడ్లీ కోసం హోటల్ కు వెళ్లారు. ఆర్డర్ రాగానే వారిద్దరూ తమకు అదనంగా సాంబార్ ప్యాకెట్ ఇవ్వాలని సిబ్బందిని కోరారు.

అయితే అదనపు సాంబారు ప్యాకెట్ ఇవ్వలేమని సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత వాగ్వాదం తర్వాత ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. పార్కింగ్ స్థలంలో వెంటనే తమ వాహనాన్ని తీసుకెళ్లాలని కోరడంతో ఇద్దరూ సెక్యూరిటీపై దాడి చేయడం ప్రారంభించారు. అయితే ఈ సంఘటనను గమనించిన సూపర్ వైజర్ అరుణ్ సంఘటనా స్థలానికి వెళ్లి సెక్యూరిటీపై దాడి చేయడం ఆపాలని కోరారని, అయితే అరుణ్ కుమార్ అరుణ్ తల, నుదుటి, మెడపై దాడి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే గమనించి జీజీహెచ్ కు తరలించగా అప్పటికే అరుణ్ మృతి చెందాడు.

సమాచారం అందుకున్న శంకర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శంకర్, అరుణ్ కుమార్ లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూపర్ వైజర్ తంజావూరుకు చెందినవాడని, అతను చెన్నైకి వచ్చి గత కొన్నేళ్లుగా రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. గత ఏడాది అరుణ్ తన ప్రియురాలు పవిత్రను వివాహం చేసుకుని పొదిచలూరులో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.