బీహార్ ఎన్నికల్లో నితీష్, బీజేపీ సీట్ల సర్దుబాటు ఖరారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు,... బీజేపీ సీట్ల పంపిణీపై ఓ అవగాహనకు వచ్చాయి. ఈ ఒప్పందం కింద మొత్తం 243 స్థానాలకు గాను జేడీ-యు 122 సీట్లకు..

బీహార్ ఎన్నికల్లో నితీష్, బీజేపీ సీట్ల సర్దుబాటు ఖరారు

Edited By:

Updated on: Oct 04, 2020 | 10:30 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు,… బీజేపీ సీట్ల పంపిణీపై ఓ అవగాహనకు వచ్చాయి. ఈ ఒప్పందం కింద మొత్తం 243 స్థానాలకు గాను జేడీ-యు 122 సీట్లకు, బీజేపీ 121 స్థానాలకు పోటీ చేయనున్నాయి. అంటే 50 : 50 ఫార్ములాను ఇవి అనుసరించాయి. జితన్ రామ్ మంఝి ఆధ్వర్యంలోని హిందుస్తానీ అవామీ మోర్ఛాకు జేడీ-యు కొన్ని సీట్లను కేటాయించనుంది. అలాగే రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి బీజేపీ కొన్ని స్థానాలను ఇవ్వనుంది. అయితే తమకూటమితో చేతులు కలిపితేనే అని షరతు విధించింది.ఈ నెల 28 నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us