
అంతరిక్షంపై ఎన్నోదేశాలు ఎప్పటినుంచో పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. తాజాగా భారతదేశ అంతరిక్ష కార్యక్రమంపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ప్రశంసల వర్షం కరిపించింది. స్పేస్ రంగంలో సాంకేతిక అభివృద్ధికి ఏర్పాటు చేసిన అంకుర సంస్థల కృషి గురించి వివరించింది.

ఇండియాలో విస్పోటనం లాగా సాంకేతిక అభివృద్ధి, కొత్త అన్వేషనల గురించి పరిశోధనలు జరుతున్నాయని తెలిపింది. త్వరలోనే భారత్ చైనాకు పోటీదారుగా మారుగలదని పేర్కొంది. ‘ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో ఆశ్చర్యపరిచే పోటీదారు’ అనే పేరుతో ప్రత్యేక వ్యాసాన్ని పబ్లిష్ చేసింది న్యూయార్క్ టైమ్స్.

1963లో మొదటగా రాకెట్ ప్రయోగం ప్రారంభించి నేడు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజి గల దేశంగా ఇండియా ఆవిర్భవించిందని చెప్పింది. కరోనా ప్రారంభ సమయంలో భారత్లో అంతరిక్ష పరిశోధనలపై పనిచేసే అంకుర సంస్థలు కేవలం 5 ఉండేవని.. కానీ ఇప్పుడు 140 అంకుర సంస్థలు నమోదై ఉన్నాయని పేర్కొంది.

సాంకేతిక రంగంలో ఉన్నత స్థానానికి భారత్ ఎలా చేరుకుంటుందో వివరించింది. అలాగే గత నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి వెలువరించిన సంయుక్త ప్రకటనను ఉటంకించింది. ఇరు దేశాల శత్రువైన చైనాను ఎదుర్కొనేందుకు ఇండియా, అమెరికాలకు అంతరిక్ష రంగం సరైన వేదిక కానుందని తెలిపింది.

అలాగే హైదరాబాద్ కేంద్రంగా అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్లను ఎన్వైటీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. తక్కువ ధరలో ఉపగ్రహ వాహకనౌకల సేవలు అందించేందుకు ఆ సంస్థలు చేస్తున్న ప్రయోగాలు, నూతన సాంకేతికతల అభివృద్ధి గురించి వివరించింది.

ఇస్రోకు అవసరమైన పరికరాల తయారీకి బెంగళూరు, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లో 400కు పైగా ప్రైవేటు కంపెనీలు ఆవిర్భవించాయని వెల్లడించింది. అలాగే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థలకి సంబంధించిన కొత్త ఆవిష్కరణల గురించి కూడా వివరించింది.