నెమలికి అధికారుల అంత్యక్రియలు..ఊరేగింపుగా..

|

Jun 18, 2020 | 1:02 PM

విద్యుత్ ఘాతంతో మృతిచెందిన జాతీయ ప‌క్షి నెమ‌లికి అధికారులు లాంఛ‌నంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. స్థానికుల‌తో క‌లిసి ఊరేగింపుగా పాడెను మోసుకుంటూ తీసుకెళ్లి ఖ‌న‌నం చేశారు.

నెమలికి అధికారుల అంత్యక్రియలు..ఊరేగింపుగా..
Follow us on

విద్యుత్ ఘాతంతో మృతిచెందిన జాతీయ ప‌క్షి నెమ‌లికి అధికారులు లాంఛ‌నంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. స్థానికుల‌తో క‌లిసి ఊరేగింపుగా పాడెను మోసుకుంటూ తీసుకెళ్లి ఖ‌న‌నం చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌ లో చోటు చేసుకుంది.

భ‌ర‌త్‌పూర్‌ అట‌వీప్రాంతంలో ఓ నెమ‌లి విద్యుత్ షాక్‌కు గురై చ‌నిపోయింది. అది గ‌మ‌నించిన స్థానికులు అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అట‌వీ సిబ్బంది చ‌నిపోయిన నెమ‌లిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వ‌హించిన అనంత‌రం స్థానిక స్మ‌శాన వాటిక‌లో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ద‌హ‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు స్థానికులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.