AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cabinet Decision : దేశవ్యాప్తంగా 14500 స్కూళ్ల ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

రైలు భూముల లీజు మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లీజు వ్యవధిని 5 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఐదేళ్ల పాటు..

Cabinet Decision : దేశవ్యాప్తంగా 14500 స్కూళ్ల ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..
Cabinet Decision
Sanjay Kasula
|

Updated on: Sep 07, 2022 | 4:43 PM

Share

రైల్వే శాఖలో సంస్కరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైలు భూముల లీజు మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లీజు వ్యవధిని 5 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఐదేళ్ల పాటు రైల్వే భూములను లీజ్‌కు ఇచ్చేందుకు వీలుండేది. ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇది కాకుండా, రైల్వే భూమి ఎల్‌ఎల్‌ఎఫ్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రైల్వే భూమిని 35 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

రైల్ ల్యాండ్ లీజు మార్పుకు రెండు సహాయక అంశాలు జోడించబడ్డాయి. పాత లీజు విధానంలో ప్రస్తుతం రైల్వే భూముల లీజును కలిగి ఉన్న కంపెనీలు, తమను తాము కొత్త లీజు విధానంలోకి తీసుకురావచ్చు. కార్గో సంబంధిత కంపెనీలకు మాత్రమే ఈ మినహాయింపు ఇవ్వబడుతుంది.

పీఎం శ్రీ పథకానికి కేబినెట్ ఆమోదం

పీఎం శ్రీ పథకానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14500 స్కూళ్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి శ్రీ యోజనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.27,360 కోట్లతో 14,597 పాఠశాలల నాణ్యతను 2022 నుంచి 2027కి అప్‌గ్రేడ్ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం