Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనుషులకే కాదు, జంతువుల్లోనూ గుండెపోటు మరణాలు.. వాకింగ్‌ చేస్తూ కుప్పకూలిన ఆలయ ఏనుగు

ఆలయ ఏనుగు లక్ష్మి రోజూ ఉదయం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లేది. ఎప్పటిలాగే ఈరోజు ఉదయం కూడా లక్ష్మి ఏనుగు వాకింగ్‌ కోసం రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది.

మనుషులకే కాదు, జంతువుల్లోనూ గుండెపోటు మరణాలు.. వాకింగ్‌ చేస్తూ కుప్పకూలిన ఆలయ ఏనుగు
Lakshmi
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 30, 2022 | 11:06 AM

పుదుచ్చేరిలోని ప్రముఖ మనాకుల వినాయగర్ ఆలయంలో లక్ష్మీ(32) అనే ఏనుగు వాకింగ్‌ చేస్తుండగా ఒక్కసారి కుప్పకూలి పడిపోయింది. స్పృహతప్పి పడిపోయిన లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మనక్కుల వినాయగర్ దేవాలయం పుదుచ్చేరిలో ఉంది. ఇక్కడి గణేశుడు పేరు మారువి మనక్కుల గణేశుడు. ఈ సందర్భంలో 1996లో ఐదేళ్ల వయసులో పుదుచ్చేరి మనక్కుల వినాయగర్ ఆలయానికి ఏనుగు వచ్చింది. దాని పేరు లక్ష్మి. ఇతర ఆలయ ఏనుగుల మాదిరిగా కాకుండా ఈ ఏనుగు ప్రజలతో చాలా ప్రేమగా వ్యవహరిస్తుంది. లక్ష్మీ ఏనుగును పుదుచ్చేరి ప్రజలు ఎంతో అభిమానించారు. మనకుల గణేశ ఆలయాన్ని సందర్శించే చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు, పర్యాటకులు ఏనుగు లక్ష్మీదేవిని దర్శించుకోకుండా వెళ్లరు.

మనకుల వినాయగర్ దేవాలయం ప్రాంగణంలో లక్ష్మి స్పృహతప్పి పడిపోయి ఉండటం గమనించిన భక్తులు షాక్‌కు గురయ్యారు. పుదుచ్చేరి మనక్కుల వినాయగర్ ఆలయ ఏనుగు లక్ష్మి రోజూ ఉదయం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లేది. ఎప్పటిలాగే ఈరోజు ఉదయం కూడా లక్ష్మి ఏనుగు వాకింగ్‌ కోసం రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. అది గమనించిన మావటి వెంటనే భయాందోళనకు గురై ఏనుగును లేపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ భారీ కాయంతో ఉన్న ఆ లక్ష్మీ ఏనుగు కదలకుండా ఉండిపోయింది.

వెంటనే ఏనుగును పరీక్షించిన వైద్యులు ఏనుగు మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటుతో ఏనుగు మృతి చెంది ఉండవచ్చని వైద్యులు తెలిపారు. ప్రసిద్ధి చెందిన మనకుల వినాయగర్ ఆలయంలో ఏనుగు మృతి చెందడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి