నాలుగు నెలల క్రితమే ప్రేమ – పెళ్లి.. భార్యకు విషమిచ్చి చింపేసిన భర్త..!

వరకట్న దాహానికి మరో అబల బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే, ఆమెను కడతేర్చాడు. గురుగ్రామ్‌లో వరకట్నం డిమాండ్ల కారణంగా భర్త తన భార్యను హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని వృత్తిరీత్యా రేడియాలజిస్ట్ అయిన అరుణ్ శర్మగా గుర్తించగా, మృతురాలు కాజల్ నర్సుగా పనిచేస్తోంది.

నాలుగు నెలల క్రితమే ప్రేమ - పెళ్లి.. భార్యకు విషమిచ్చి చింపేసిన భర్త..!
Man Kills Wife

Updated on: Mar 23, 2026 | 10:26 AM

వరకట్న దాహానికి మరో అబల బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే, ఆమెను కడతేర్చాడు. గురుగ్రామ్‌లో వరకట్నం డిమాండ్ల కారణంగా భర్త తన భార్యను హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని వృత్తిరీత్యా రేడియాలజిస్ట్ అయిన అరుణ్ శర్మగా గుర్తించగా, మృతురాలు కాజల్ నర్సుగా పనిచేస్తోంది.

అరుణ్, కాజల్ గురుగ్రామ్‌లోని ఒక నర్సింగ్ హోమ్‌లో కలుసుకున్నారు. వారు కలిసి పనిచేశారు, వారి స్నేహం క్రమంగా ప్రేమగా వికసించింది. వారి కుటుంబాల అంగీకారంతో, గత సంవత్సరం నవంబర్‌లో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత అసలు వివాదం మొదలైంది. పెళ్లయిన కొద్దికాలానికే అరుణ్ ప్రవర్తన మారిపోయిందని కాజల్ కుటుంబం ఆరోపిస్తోంది. అతను చిన్న చిన్న విషయాలకే కాజల్‌ను కొట్టేవాడని, నిరంతరం డబ్బులు డిమాండ్ చేసేవాడని వారు చెబుతున్నారు. వరకట్నం కోసం ఆమె మానసిక, శారీరక వేధింపులకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలావుంటే, ఆ జంట మార్చి 4న హోలీ రోజున గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులో ఉన్న కాజల్ ఇంటికి వెళ్లారు. మార్చి 17న అరుణ్ మద్యం మత్తులో కాజల్‌పై తీవ్రంగా దాడి చేయడంతో, ఇంట్లో పెద్ద గొడవ జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరుసటి రోజు కాజల్ అనుమానాస్పదస్థితిలో మరణించింది. మరుసటి రోజు ఉదయం, అరుణ్ – కాజల్‌ను కిందికి తీసుకువెళ్లాడు, అక్కడ వారిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. కొద్దిసేపటి తర్వాత, కాజల్ స్పృహ కోల్పోయింది. ముక్కు నుండి రక్తం కారుతుండగా కనిపించింది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.

ఈ సంఘటన తర్వాత, కుటుంబ సభ్యులు టాయిలెట్‌లో ఒక సిరంజిని కనుగొన్నారు. దీంతో కాజల్‌కు విషం ఎక్కించారని మృతురాలి కుటుంబసభ్యులు అనుమానించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో, కాజల్‌కు అరుణ్ విషం ఎక్కించి చంపినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడు అరుణ్‌ను రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. అతను ఘజియాబాద్‌లోని బెహ్తా హజీపూర్‌కు చెందినవాడని, మాదకద్రవ్యాలకు బానిసగా కూడా మారాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు తీసుకున్నట్లు సెక్టార్ 10 పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి కుల్దీప్ సింగ్ తెలిపారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్టుమార్టం కోసం పంపినట్లు వైద్యులు తెలిపారు. నివేదిక అందిన తర్వాతే పూర్తి నిజం వెల్లడవుతుందని పోలీసులు చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us