Crime News: కేవలం 2 మామిడి పండ్ల కోసం వ్యక్తి దారుణ హత్య! అలేం జరిగిందంటే..

|

Jun 22, 2022 | 11:19 AM

మామిడి కాయలు కోసిన నేరానికి ఓ వ్యక్తి నిండు ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గుల్రిహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాయ సంఘటన చోటుచేసుకుంది..

Crime News: కేవలం 2 మామిడి పండ్ల కోసం వ్యక్తి దారుణ హత్య! అలేం జరిగిందంటే..
Mangoes
Follow us on

Uttar Pradesh Crime news: మామిడి కాయలు కోసిన నేరానికి ఓ వ్యక్తి నిండు ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గుల్రిహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాయ సంఘటన చోటుచేసుకుంది. భగవాన్‌పూర్‌ గ్రామానికి చెందిన రామరతన్ నిషాద్ (29) ఆదివారం సాయంత్రం ఇంటి వరండాలో కూర్చుని, తమ కుటుంబ ఉమ్మడి మామిడి చెట్టు నుంచి రెండు మామిడికాయలను కోసుకుని తిన్నాడు. ఈ విషయమై రామరతన్, తండ్రి మోహిత్‌ నిషాద్‌, అతని సోదరుడు సురేంద్ర నిషాద్‌ల మధ్య కొంత సమయం వాగ్వివాదం జరిగింది. అది ఉమ్మడి చెట్టని, ఆదివారం మామిడి కాయలను పంచిన తర్వాత చెట్టుకు మిగిలిన రెండు మామిడి కాయలను తన భర్త కోసి తిన్నందుకు తండ్రి మోహిత్‌, సోదరుడు సురేంద్ర తన భర్తను కర్రలతో విచక్షణా రహితంగా కొట్టినట్లు తెల్పింది.

తీవ్ర గాయాలపాలైన రామరతన్‌ను ఆసుపత్రికి సైతం ఎవ్వరూ తీసుకువెళ్లకపోడంతో.. రాత్రం ఇంట్లోనో గాయాలతో బాధపడ్డాడని, సోమవారం ఉదయం 5 గంటలకు రామరతన్ మృతి చెందినట్లు తెల్పింది. భర్త మరణించడంతో రామరతన్ భార్య కిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మామ, బావ తన భర్తను చంపడానికి గుండెలపై పదేపదే తన్నారని, కర్రలతో తీవ్రంగా గాయపరిచారని పోలీసులకు తెల్పింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్‌ చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులైన మోహిత్‌ నిషాద్‌, సురేంద్ర నిషాద్‌లనుపోలీసులు అరెస్టు చేసి, విచారణ చెపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ గుల్రిహా ఉమేష్ కుమార్ వాజ్‌పేయి మీడియాకు తెలిపారు.