Bjp Chief Jp Nadda: అహంకారం వల్లే మమత రైతు చట్టాలను అమలు చేయడంలేదు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

తన అహంకారం వల్లే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. ఆమె 'ఇగో' కారణంగా..

Bjp Chief Jp Nadda: అహంకారం వల్లే మమత రైతు చట్టాలను అమలు చేయడంలేదు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2021 | 3:47 PM

తన అహంకారం వల్లే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. ఆమె ‘ఇగో’ కారణంగా ఇక్కడి రైతులు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందలేకపోయారన్నారు. మాల్దాలో శనివారం జరిగిన రోడ్ షో లో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ రాష్ట్ర ప్రజలు మమతకు, ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ‘టాటా’ చెప్పడం  ఖాయమని అన్నారు. తన అహాన్ని తృప్తి పరచేందుకే మమత రైతు సంక్షేమ పథకాల అమలుకు అంగీకరించడంలేదని ఆయన విమర్శించారు. కానీ రైతులు వీటిని సమ్మతించిన అనంతరం తాము అమలు చేస్తామని  ఆమె ఇప్పుడు హామీ ఇస్తున్నారని, ఇది వంచనే అని నడ్డా అన్నారు. గత 2 సంవత్సరాలుగా బెంగాల్ లోని 70 లక్షలమంది రైతులు తమకు ఏటా అందాల్సిన 6 వేలరూపాయల సాయాన్ని అందుకోలేకపోయారని నడ్డా పేర్కొన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోకాలడ్డుతున్నారన్నారు.

మాల్దాలోనెలరోజులుగా బీజేపీ చేబట్టిన కృషక్ సురక్షా అభియాన్ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఇదే సందర్భంగా నడ్డా తమ రోడ్ షో ని దాదాపు ఎన్నికల ప్రచార సభలా వినియోగించుకున్నారు.  సుమారు కిలోమీటర్ దూరం మేరా ఈ రోడ్ షో సాగింది. పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ షో లో పాల్గొన్నారు.

Read More:

ఆ యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు నారా లోకేష్‌ లేఖ

మావోయిస్టుల ఏరివేతకు మహిళా కమెండోలు.. మహిళా బెటాలియన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న కమెండోలు

మావోయిస్టుల ఏరివేతకు మహిళా కమెండోలు.. మహిళా బెటాలియన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న కమెండోలు

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు