రెండు ట్రక్కుల్లో 300 మంది వర్కర్లు.. షాక్ తిన్న మహారాష్ట్ర పోలీసులు

| Edited By: Anil kumar poka

Mar 27, 2020 | 11:09 AM

రెండు కంటెయినర్ ట్రక్కుల్లో 300 మంది వర్కర్లను చూసిన మహారాష్ట్ర పోలీసులు షాక్ తిన్నారు. వీరంతా తెలంగాణ నుంచి రాజస్తాన్ కు నిత్యావసర సరకులను తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది.

రెండు ట్రక్కుల్లో 300 మంది వర్కర్లు.. షాక్ తిన్న మహారాష్ట్ర పోలీసులు
Follow us on

రెండు కంటెయినర్ ట్రక్కుల్లో 300 మంది వర్కర్లను చూసిన మహారాష్ట్ర పోలీసులు షాక్ తిన్నారు. వీరంతా తెలంగాణ నుంచి రాజస్తాన్ కు నిత్యావసర సరకులను తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన వీరు తమ సొంత ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రమాదకరమైన ఇలాంటి పధ్దతిని ఎంచుకోవడం ఖాకీలను విస్మయానికి గురి చేసింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అనేకమంది దినసరి కూలీలు, కార్మికులు ఈ విధంగా అడ్డదారులు వెతుక్కుంటున్నట్టు కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. తెలంగాణ నుంచి ఈ రెండు ట్రక్కులు యావత్ మల్ జిల్లాకు చేరుకోగా.. తనిఖీ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ వాహనాలను ఆపివేసినప్పుడు వీటిలో కుక్కివేసినట్టున్న ఈ కార్మికులు కనబడ్డారు. రాజస్తాన్ పంధార్ కావడ వద్ద టోల్ గేట్ బూత్ సిబ్బంది.. ఈ ట్రక్కులను చూసి.. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ఈ వాహనాల డ్రైవర్లను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారట. దీంతో అనుమానం వఛ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ట్రక్కు డ్రైవర్లపై ఖాకీలు చర్యలకు ఉపక్రమించారు. అయితే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ 300 మంది వర్కర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక  అధికారులు అయోమయంలో ఉన్నారు.