Viral: మరికొన్ని గంటల్లో అక్కతో పెళ్లి.. చెల్లి కావాలంటూ వరుడి వింత షరతు.. చివరకు..

మరి కొన్ని గంటల్లో పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వరుడు వధువు ఇంటికి రావాల్సి ఉంది.. ఈ క్రమంలోనే.. వరుడు.. వధువు తండ్రికి ఫోన్ చేశాడు.. పెద్దమ్మాయి అయితే వద్దు.. చిన్నమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పాడు.. దీంతో పెళ్లింట కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకుని.. వధువు విషం తాగి ఆత్మాహత్యాయత్నం చేసింది.

Viral: మరికొన్ని గంటల్లో అక్కతో పెళ్లి.. చెల్లి కావాలంటూ వరుడి వింత షరతు.. చివరకు..
Wedding

Updated on: Apr 20, 2025 | 11:51 AM

మరి కొన్ని గంటల్లో పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వరుడు వధువు ఇంటికి రావాల్సి ఉంది.. ఈ క్రమంలోనే.. వరుడు.. వధువు తండ్రికి ఫోన్ చేశాడు.. పెద్దమ్మాయి అయితే వద్దు.. చిన్నమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పాడు.. దీంతో పెళ్లింట కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకుని.. వధువు విషం తాగి ఆత్మాహత్యాయత్నం చేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని రేవా మన్‌గవాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని మాంగవాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన ఒక అమ్మాయి వివాహం సిద్ధికి చెందిన అబ్బాయితో నిశ్చయమైంది. వివాహ వేడుక కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ఏప్రిల్ 16న సిద్ధిలో తిలకోత్సవ వేడుక కూడా జరిగింది. వివాహ ఊరేగింపు ఏప్రిల్ 18న రావాల్సి ఉంది. కానీ పెళ్లి ఊరేగింపు రావడానికి ఒక రోజు ముందు, వరుడు అకస్మాత్తుగా వధువు తండ్రికి ఫోన్ చేశాడు.. వధువును మార్చాలని కోరాడు.. పెద్దమ్మాయి వద్దు.. మీ చిన్నామ్మాయి (వధువు చెల్లెలిని) ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత ఒక్కసాగా కలకలం రేగింది.. ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.. దీంతో వధువు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రి తరలించారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స పొందుతోందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయంపై వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే.. ఆ అమ్మాయి అబ్బాయి కంటే పెద్దదని, ఈ విషయం అబ్బాయికి.. అతని కుటుంబ సభ్యులకు ఇప్పటికే చెప్పామని, అయినప్పటికీ వారు పెళ్లి నిశ్చయించుకున్నారని వధువు కుటుంబం తెలిపింది.. ఇప్పుడు పెళ్లికి ఒక రోజు ముందు, అతను వధువు చెల్లెలిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం మంచిదికాదన్నారు. ఆ అబ్బాయికి పెళ్లి ఇష్టం లేకపోతే ముందుగానే చెబితే బాగుండేదని పేర్కొన్నారు. కాగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు తర్వాత తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని రీవా ఎస్పీ వివేక్‌సింగ్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..